పారితోషికాన్నీ త్యాగం చేసిన రాజ‌మౌళి

బాహుబ‌లి 2 వెయ్యి కోట్ల సినిమా అవ్వ‌డానికి ప‌రుగులు తీస్తోంది. తొలిభాగం దాదాపుగా ఆరొంద‌ల కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసింది. మొత్తంగా కలుపుకొనిచూస్తే ఈ రెండు సినిమాలూ దాదాపు రూ.1500 కోట్లు సాధించ‌బోతున్న‌ట్టు లెక్క‌. ఆర్థికంగా బాహుబ‌లి సినిమాల విష‌యాన్ని అంచ‌నా వేయ‌డానికి ఈ అంకెకు మించిన ఆస‌రా ఏముంటుంది? బాహుబ‌లి సిరీస్ తో రాజ‌మౌళి బాగా మిగులుచ్చుకొన్నాడ‌ని, భారీ ఎత్తున పారితోషికం తీసుకొన్నాడ‌ని, అది రూ.60 కోట్ల‌కుపైమాటే అని ర‌క‌రకాల ఊహాగానాలు వ్య‌క్తం అవుతున్నాయి. రాజ‌మౌళి ఈ సినిమా ద్వారా ఎంత మిగిల్చుకొన్నాడో రాజ‌మౌళికీ, ఆ నిర్మాత‌ల‌కే ఎరుక గానీ.. నిజానికి ఈ ప్రాజెక్టు మొద‌లెట్టేట‌ప్పుడు పారితోషికం ప్ర‌స్తావ‌నే రాలేద‌ట‌. బాహుబ‌లిని ఇప్పుడంటే ఆహా ఓహో అని పొగిడేస్తున్నాం, క‌రిగిపోతున్న రికార్డుల‌ను చూసి త‌రించిపోతున్నాం గానీ.. మొద‌లెట్టేట‌ప్పుడు మాత్రం భ‌యం భ‌యంగానే ఉంద‌ట‌. ఇంత పెట్టుబ‌డి పెడుతున్నాం… తిరిగి రాబ‌ట్ట‌డం కుదిరే ప‌నేనా? అంటూ లెక్క‌లేసుకొన్నార్ట‌. ఒక‌వేళ అటూ ఇటూ అయితే పారితోషికాలు వెన‌క్కి ఇచ్చేయ‌డానికి రాజ‌మౌళి, ప్ర‌భాస్‌, రానా సంసిద్ద‌మ‌య్యార్ట‌.

అప్ప‌టి వ‌ర‌కూ తీసుకొంటున్న పారితోషికం కంటే.. త‌క్కువ మొత్త‌మే ఎగ్రిమెంట్‌లో రాసుకొన్నార‌ని, పారితోషికాల్ని `త్యాగం` చేయ‌డంతోనే.. బాహుబ‌లి సినిమా మొద‌లైంద‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి సైతం అంగీక‌రించాడు. ”మేం చేస్తోంది రిస్క్ అని మాకు తెలుసు. అందుకే పారితోషికాలు త‌గ్గినా ఫ‌ర్వాలేద‌నుకొన్నాం” అని అస‌లు గుట్టు విప్పేశాడు. అయితే… బాహుబ‌లి 1 సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం, పార్ట్ 2పై అంచ‌నాలు పెర‌గ‌డం, దానికీ ఊహించిన దానికంటే ఎక్కువ మార్కెట్టే జ‌ర‌గ‌డంతో.. రాసుకొన్న పారితోషికాల కంటే ఎక్కువ మొత్తం చెల్లించార్ట నిర్మాత‌లు. ఆ మొత్తం ఎంత‌న్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close