అర‌చేతిలో అమ‌రావ‌తి అద్భుతం ఇంకెన్నాళ్లు..!

‘న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ‌స్థాయి న‌గ‌రంగా నిర్మిస్తాం’… ఎప్పుడో మూడేళ్ల కింద‌ట ఎన్నిక‌లప్పుడు ఇదే మాట చెప్పారు! ఆ త‌రువాత‌, చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేస్తున్న‌ప్పుడూ ఇదే చెప్పారు. ఏడాది పాల‌న పూర్త‌యిన సంద‌ర్భంగా ఇదే చెప్పారు. శంకుస్థాప‌న స‌మ‌యంలో ఇదే చెప్పారు. విదేశాల‌కు ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నప్పుడూ ఇదే చెబుతున్నారు. ఆ మ‌ధ్య దావోస్ కి వెళ్లొచ్చాక ఇదే అన్నారు! ఇప్పుడు అమెరికా ప‌ర్య‌ట‌న‌లో కూడా అదే మాట మీద నిల‌బ‌డుతున్నారు!

ప్ర‌పంచంలోనే ఐదు అత్యుత్త‌మ న‌గ‌రాల జాబితాలో అమ‌రావ‌తి ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అమెరికా ప‌ర్య‌ట‌నలో భాగంగా చెప్పారు. అక్క‌డ కొంత‌మంది ప్ర‌వాస భార‌తీయ సీయీవోల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి విశిష్ఠ‌త‌ను వివ‌రించారు. అమ‌రావ‌తి రాజధానిగా నిర్మించ‌డం త‌మ‌కు ఒక గొప్ప అవ‌కాశం అన్నారు. త‌న పిలుపున‌కు స్పందించి… ఎంతో దీర్ఘ‌దృష్టితో ఆలోచించిన రైతులు 33 వేల ఎక‌రాల భూముల్ని ఇచ్చేశార‌న్నారు. ఏపీ ప్ర‌జ‌ల‌కు త‌నపై అంత న‌మ్మ‌కం ఉంద‌నీ, మీరు కూడా అంతే న‌మ్మ‌కంతో ఆంధ్రా అభివృద్ధికి చేయూత ఇవ్వండీ అంటూ సీయీవోల‌ను కోరారు. అంతేకాదు, మ‌రో ద‌శాబ్దన్న‌ర పాటు ఆంధ్రా వృద్ధి రేటు 15 ఉంటుంద‌ని చెప్పారు.

అమ‌రావ‌తి న‌గ‌రం నిర్మించ‌డం చంద్ర‌బాబుకు ద‌క్కిన అవ‌కాశ‌మే! కానీ, ఇంకా ఎన్నాళ్లీ అవ‌కాశం. మూడేళ్లుగా ఇదే మాట చెబుతున్నారు. నిధుల్లేక‌పోయినా గుండె నిబ్బ‌రం ఉంది అంటున్నారు. నిబ్బ‌రంతోనే నిర్మాణాలు జ‌రిగిపోతాయా..? గ‌డ‌చిన మూడేళ్ల‌లో అమ‌రావ‌తి గురించి చేసిందేముందీ.. అంటే, పునాదిరాళ్లు త‌ప్ప ఏదీ జ‌ర‌గ‌లేదు. అమ‌రావ‌తిలో ఎలాంటి భ‌వ‌నాలు క‌ట్టాలో ఇప్ప‌టికీ ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర క్లారిటీ లేదు. ఆ మ‌ధ్య జ‌పాన్ కి చెందిన మాకీ కంపెనీతో డిజైన్లు చేయించారు. అవి బాలేవంటూ ఆ కంపెనీని త‌ప్పించి, ఇంకో కంపెనీతో న‌మూనాలు వేయించుకున్నారు. పోనీ, వాటినైనా ఫైన‌ల్ చేశారంటే… అదీ లేదు. అవీ కాస్త తేడాగానే ఉన్న‌ట్టు ఇటీవ‌లే మంత్రి నారాయ‌ణ నీళ్లు న‌ములుతూ చెప్పిన సంగ‌తి తెలిసిందే.

నిజ‌మే, అమ‌రావ‌తి లాంటి న‌గ‌రం నిర్మించాలంటే సుదీర్ఘ‌మైన ప‌నే. ఎంతో మేథోమ‌ధ‌నం అవ‌స‌రం. కానీ, మూడేళ్లుగా డిజైన్ల‌నే ఫైన‌ల్ చేయ‌లేక‌పోయారు. మ‌రో ఏడాదిన్న‌ర‌లో ముందస్తు ఎన్నిక‌లంటూ ఆ మ‌ధ్య సంకేతాలిచ్చారు. అంటే, ఈ టెర్మ్ కి అమ‌రావ‌తి ఇంతేనా అనేది సామాన్యుడి అనుమానం. క‌నీసం… మౌలిక స‌దుపాయాల‌పై దృష్టినా బాగుండేది. నిజానికి, మ‌హా న‌గ‌రాల‌ను నిర్మించ‌డం సాధ్య‌మా..? న‌గ‌రాలు మ‌హాన‌గ‌రాలు కావాలంటే ప్రైవేటు సంస్థ‌లు రావాలి. విదేశీ సంస్థ‌లు రావాలి. ఎక‌నామిక్ యాక్టివిటీ పెర‌గాలి. అనుబంధంగా ఇత‌ర చిన్న త‌ర‌హా వ్యాపార వాణిజ్యాలు పెర‌గాలి. ఇవ‌న్నీ ప్లాన్ చేస్తే జ‌రిగేవి కావు క‌దా! టైమ్ ఫ్రేమ్ పెట్టుకుంటే వ‌చ్చేవి కావు. అందుకే, ముందుగా మౌలిక స‌దుపాయాల‌పై దృష్టి పెట్టాలి. వాటి గురించి కూడా మాట్లాడ‌కుండా… ‘అమ‌రావతి నిర్మాణం మాకో అవ‌కాశం’ అని ఇంకెన్నాళ్లు చెబుతారు..? ఇంకెన్ని దేశాల్లో ఇదే మాటకు చాటింపేస్తారు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close