రూ.500 కోట్ల‌తో రామాయణం : అల్లు అర‌వింద్ ఏమంటున్నాడు?

టాలీవుడ్‌లో మ‌రో భారీ ప్రాజెక్టుకు అతి త్వ‌ర‌లో శ్రీ‌కారం చుట్ట‌బోతోంది. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ చిత్రానికీ పెట్ట‌నంత పెట్టుబ‌డితో ఏకంగా రూ.500 కోట్ల‌తో ఓ చిత్రం రూపొంద‌నుంది. అదీ మ‌న తెలుగులో. రామాయ‌ణ గాథ‌ని వెండి తెర‌పై ఆవిష్క‌రించ‌డానికి ఓ భారీ క‌స‌ర‌త్తు మొద‌లైంది. ఈ ప్రాజెక్టులో అల్లు అర‌వింద్, మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రా భాగ‌స్వాములు కాబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. అయితే న‌టీన‌టులు ఎవ‌రు? సాంకేతిక నిపుణులెవ‌రు? అనే విష‌యాల‌పై క్లారిటీ రావాల్సివుంది. “ఈ ప్రాజెక్టు ఓ గురు త‌ర బాధ్య‌త‌. అనిత‌ర సాధ్య‌మైన ఓ చిత్రాన్ని భార‌తీయ సినీ ప్రేక్ష‌కుల‌కు అందివ్వ‌బోతున్నాం. ప్ర‌స్తుతం న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే మిగిలిన వివ‌రాలు చెబుతాం“ అని ప్ర‌క‌టించారు అల్లు అర‌వింద్‌. మెగా ఫ్యామిలీలో బోల్డంత మంది హీరోలున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌లు స్టార్ డ‌మ్ సంపాదించుకొన్నారు. పైగా క‌త్తి యుద్దాల్లో ప్రావీణ్యం ద‌క్కించుకొన్న‌వాళ్లే. మ‌రి వీళ్ల‌లో ఎవ‌రికి ఈ రామాయ‌ణంలో ఛాన్స్ వ‌స్తుందో చూడాలి. అంత‌ర్జాతీయ ప్రాజెక్టు కాబట్టి మిగిలిన అన్ని భార‌తీయ భాష‌ల్లోకీ ఈ సినిమాని విడుద‌ల చేస్తారు. త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ చిత్ర సీమ‌ల‌నుంచి కూడా న‌టీన‌టుల్ని, సాంకేతిక నిపుణుల్నీ ఎంపిక చేసుకోవ‌డం త‌థ్యం. మ‌రి.. ఆ జాబితాలో ఎవ‌రెవ‌రు ఉంటారో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఘరానా మోసం… బ్రతికున్నా చంపేస్తున్నారు..!!

హైదరాబాద్ చుట్టుప్రక్కల మీ పేరిట ప్లాట్ ఉందా..? డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని తీరిగ్గా ఉన్నారా..? అయినా ప్లాట్ల విషయంలో ప్రమాదం పొంచి ఉందండోయ్. నకిలీ ఆధార్ , నకిలీ ధృవీకరణపత్రాలు, నకిలీ ఓనర్...

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close