ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

సినిమాలు ముఖ్య‌మా?? ప్ర‌జా జీవితం, వాళ్ల స‌మ‌స్య‌లు ముఖ్య‌మా?? అని అడిగితే రెండో దానివైపే మొగ్గు చూపుతాడు ప‌వ‌న్ క‌ల్యాణ్. సినిమాలంటే త‌న‌కు పెద్ద వ్యామోహం లేద‌ని, సినిమాల నుంచి త‌ప్పుకోవ‌డానికి సైతం తాను సిద్దంగా ఉన్నాన‌ని ఇది వ‌ర‌కే చెప్పాడు. ఇప్పుడు మ‌ళ్లీ అదే మాట చెప్పి ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చాడు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అలుపెరుగ‌ని పోరాటం చేస్తాన‌ని.. కావాలంటే సినిమాల‌కు దూరం అవ్వ‌డానికి కూడా తాను రెడీగానే ఉన్నాన‌ని చెప్పుకొచ్చాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఈరోజు హైద‌రాబాద్‌లోని జ‌న‌సేన కార్యాల‌యంలో అనంత‌పురం నుంచి వ‌చ్చిన 150మంది ప్ర‌తినిధుల‌తో ప‌వ‌న్ స‌మావేశం అయ్యాడు. ఈ సంద‌ర్భంగా రాజ‌కీయాల‌పై, సినీ జీవితం గురించీ ప‌వ‌న్ మాట్లాడాడు. తన‌ని పార్ట్ టైమ్ రాజ‌కీయ వేత్త అంటున్నార‌ని, చాలామంది రాజ‌కీయ నాయ‌కులు ఇంట్లో కూర్చుని రాజ‌కీయం చేస్తున్నార‌ని, తాను మాత్రం అలాంటివాడ్ని కాద‌ని, వీలైతే సినిమాల‌కు దూర‌మై పూర్తి స్థాయిలో ప్ర‌జా సేవ చేస్తాన‌ని చెప్పుకొచ్చాడు ప‌వ‌న్‌.

”సినిమాలంటే నాకు గౌర‌వ‌మే. నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది సినిమాలే. నా సిబ్బంది కోసం, వాళ్ల జీత భ‌త్యాల కోసం సినిమాల్లో న‌టిస్తున్నా. ప్ర‌జ‌ల కోసం.. సినిమాల్ని తాత్కాలికంగా పక్క‌న పెట్టి సేవ చేయ‌డానికి సిద్దంగా ఉన్నా” అన్నాడు ప‌వ‌న్. వచ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని, అనంత‌పురం జిల్లా నుంచే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో దిగుతాన‌ని మ‌రోసారి చెప్పాడు. సో.. ప‌వ‌న్ నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు కాస్త వేగం పెంచాల్సిందే. అయ్య‌గారి మూడ్ మారితే… షూటింగ్‌కి పేక‌ప్ చెప్పేయ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close