ట్రైల‌ర్ టాక్ : న‌క్ష‌త్రం

కృష్ణ‌వంశీ సినిమా అంటే ఓ అటెన్ష‌న్ మొద‌లైపోతుంది. హిట్టూ ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ఆయ‌న‌కంటూ ఓ అభిమాన గ‌ణం ఉంది. వాళ్లంతా… కృష్ణ‌వంశీ సినిమా అంటే చాలు.. హీరో ఎవ‌రైనా స‌రే చూసేస్తారు. ఈసారి.. సందీప్‌కిష‌న్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, త‌నీష్ ల‌ను ఎంచుకొని ఓ బుల్లి మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేశాడు. అదే.. న‌క్ష‌త్రం. ట్రైల‌ర్ కూడా విడుద‌లైంది. ఎమోష‌న్ డైలాగులు, సందీప్ కిష‌న్ పెర్‌ఫార్మ్సెన్సూ, హీరోయిన్ల గ్లామ‌ర్‌… ఇలా రెగ్యుల‌ర్ కృష్ణ‌వంశీ స్టైల్‌లోనే సాగింది ట్రైల‌ర్‌. బాంబు బ్లాస్టింగులు, అరుపులూ చూస్తుంటే.. ఇదేదో డ‌బ్బింగ్ సినిమా చూస్తున్నామా?? అనే ఫీలింగ్ క‌ల‌గ‌క మాన‌దు. రెజీనా, ప్ర‌గ్యా అయితే గ్లామ‌ర్ విందు అందివ్వ‌డం ఖాయం. క‌థానాయ‌కుడికి పోలీస్ అవ్వాల‌న్న ఆశ‌. దాన్ని అడ్డుకొన్న విల‌న్‌.. పోలీస్ అవ్వ‌క‌పోయినా… పోలీస్ లా బిహేవ్ చేసే హీరో.. ఇదీ క‌థ‌. అలెగ్జాండ‌ర్ గా సాయిధ‌ర‌మ్ తేజ్ క‌నిపించ‌నున్నాడు. ”అలెగ్జాండ‌ర్ అంటే ఎవ‌ర‌నుకొంటున్నావ్‌” అంటూ శివాజీ రాజా ఎమోష‌న్‌గా డైలాగ్ చెప్ప‌డం చూస్తుంటే… ఇంద్ర, బాషా టైపు ఫ్లాష్ బ్యాక్ ఏదో అలెగ్జాండ‌ర్ పాత్ర‌కి కూడా ఆపాదించ‌ర‌న్న‌ది అర్థం అవుతోంది. మొత్తానికి ఈ న‌క్ష‌త్రంలో కొత్త మెరుపులేం లేవు. వెండి తెర‌పై ఏ మేర‌కు రాణిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close