బాహుబలి ‘శాటిలైట్’ రేట్ – రు.29 కోట్లు

హైదరాబాద్: తెలుగు, తమిళంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డ్‌లు నెలకొల్పిన ‘బాహుబలి’, శాటిలైట్ రైట్స్‌ రేటులోనూ రికార్డ్ సృష్టించింది. సాధారణంగా భారీ చిత్రాల శాటిలైట్ రైట్స్ విడుదలకు ముందే అమ్ముడవుతుంటాయి. కానీ బాహుబలికి మాత్రం రెండునెలల తర్వాత అమ్ముడు పోవటం విశేషం. మంచి రేటుకోసం నిర్మాతలు ఆగటమే దీనికి కారణంగా చెబుతున్నారు.

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం బాహుబలి శాటిలైట్ రైట్స్ రు.29 కోట్లకు అమ్ముడు పోయినట్లు ఒక ఆంగ్ల దినపత్రిక ఇవాళ ఒక కథనాన్ని వెలువరించింది. అయితే ఈ రేటు రెండు భాగాలకూ కలిపి అని పేర్కొన్నారు. విడుదలైన మొదటి భాగాన్ని రు.18 -20 కోట్ల మధ్యలో అమ్ముదామని నిర్మాతలు భావించారట. సాధారణంగా తెలుగులో పెద్ద చిత్రాలకు రు.9 – 12 కోట్ల వరకు రేటు పలుకుతుంది. దీంతో బాహుబలి మొదటి భాగానికి నిర్మాతలు చెప్పిన రేటుకు పెద్దగా స్పందన రాలేదు. ఈ కారణంగా నిర్మాతలు రెండు భాగాల శాటిలైట్ రైట్స్‌నూ హోల్‌సేల్‍‌గా అమ్మేశారని కథనం. రెండోభాగం చిత్రీకరణ ఈ నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. 40శాతం షూటింగ్ గతంలోనే పూర్తయింది. అతిత్వరగా – నాలుగు నెలల్లో చిత్రీకరణను పూర్తిచేసి 2016 జులైలో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close