గౌత‌మ్ నంద‌.. నిర్మాత‌లు గాయ‌బ్‌

సినిమా విడుద‌ల అవుతోందంటే… నిర్మాత‌ల‌కు ఎంత టెన్ష‌న్‌. ప్రింటు స‌రిగా వెళ్లిందా, లేదా? ప‌బ్లిసిటీ స‌రిగా జ‌రుగుతోందా లేదా? ఇంట‌ర్వ్యూలు.. ప్రెస్ మీట్లు ఇలా ఎన్ని ర‌కాల ప‌నులో. ఎవ‌రికీ లేనంత టెన్ష‌న్ నిర్మాత‌లు అనుభ‌విస్తుంటారు. అయితే.. గౌత‌మ్ నంద విష‌యంలో ఈ సీన్ రివ‌ర్స్ అయ్యింది. రిలీజ్ టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతుంటే నిర్మాత‌లు ప‌త్తా లేకుండా పోయారు. ప‌బ్లిసిటీ వ్య‌వ‌హారాలు మొత్తం ద‌ర్శ‌కుడు సంప‌త్‌నందినే చూసుకొంటున్నాడు. గౌత‌మ్ నంద‌… మంచి టేబుల్ ప్రాఫిట్ ద‌క్కించుకొంది. ఈ సినిమాతో నిర్మాత‌లిద్ద‌రూ సొమ్ము చేసుకొన్నారు. అందులో కొంచెం ప‌బ్లిసిటీకి ఖ‌ర్చు చేసినా స‌రిపోయేది. కానీ.. భ‌గ‌వాన్‌, పుల్లారావులు మాత్రం ‘లాభాలొచ్చేశాయ్‌.. ఇక చాలు’ అనుకొన్నారో ఏమో.. ప‌బ్లిసిటీని వ‌దిలేశారు.

కీల‌క‌మైన ద‌శ‌లో ప‌బ్లిసిటీ చేయ‌క‌పోవ‌డంతో.. సంప‌త్ నంది రంగంలోకి దిగాల్సివ‌చ్చింది. త‌న జేబులోంచి కొంత‌, గోపీచంద్ జేబులోంచి కొంత తీసి ప‌బ్లిసిటీకి ఖ‌ర్చు పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల కేథ‌రిన్ ఇంట‌ర్వ్యూలు జ‌రిపించారు. వేరే చోట నుంచి సినిమా ప్ర‌మోష‌న్ల కోసం హైద‌రాబాద్ రావాల‌నుకొన్న‌ప్పుడు… రానుపోను ర‌వాణ నిర్మాత‌లే కేటాయించాలి. కానీ కేథ‌రిన్ త‌న సొంత డ‌బ్బుల‌తో ఫ్ల‌యిట్‌లో వ‌చ్చింద‌ట‌. ప్రెస్ మీట్ నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు కూడా కేథ‌రినే పెట్టుకొంద‌ని తెలుస్తోంది. సినిమాపై న‌మ్మ‌కంతో త‌న పారితోషికంలోంచి డ‌బ్బులు తీస్తున్నారు గోపీచంద్‌, సంప‌త్ నంది. ఆ న‌మ్మ‌క‌మే ఈ సినిమాని విజ‌య‌వంతం చేయాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close