శ‌ర్వా గురించి ఓ నిజం బ‌య‌ట‌పెట్టిన ప్ర‌భాస్‌

ప్ర‌భాస్‌, శ‌ర్వానంద్ మంచి మిత్రులు. ప్ర‌భాస్ సొంత సంస్థ‌తో స‌మానమైన యువీ క్రియేష‌న్స్ తెర‌కెక్కించిన ర‌న్ రాజా ర‌న్ శ‌ర్వా కెరీర్‌నే మార్చేసింది. ఆ సినిమాతోనే క‌మ‌ర్షియ‌ల్ హీరో అయిపోయాడు. ఆ విధంగా శ‌ర్వా – ప్ర‌భాస్‌ల బంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఇప్పుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మ‌హానుభావుడు సినిమానీ యూవీ క్రియేష‌న్సే నిర్మించింది. ఆ విధంగా ప్ర‌భాస్ బ్యాన‌ర్‌లో శ‌ర్వా మ‌రో సినిమా చేసిన‌ట్టైంది. మ‌హానుభావుడు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి ప్ర‌భాస్ వ‌చ్చి… త‌న విషెష్ అంద‌జేశాడు. ఈ కార్య‌క్ర‌మంలో ర‌న్ రాజా ర‌న్ గురించి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రికీ తెలీని ఓ విష‌యం బ‌య‌ట పెట్టాడు.

ర‌న్ రాజా ర‌న్ క‌థ‌కి త‌గిన క‌థానాయ‌కుడ్ని వెదుకుతున్న త‌రుణంలో శ‌ర్వానంద్ పేరు చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ట‌. ఆ స‌మ‌యంలో శ‌ర్వా అన్ని సీరియెస్ క‌థ‌లే చేస్తున్నాడు. ర‌న్ రాజా ర‌న్‌లో హిలేరియ‌స్ కామెడీ పండించాలి. ఈ పాత్ర‌కు శ‌ర్వా స‌రిపోతాడా, లేదా? అనే అనుమానం టీమ్ కి వ‌చ్చింద‌ట‌. ”ట్రై చేసి చూద్దాం.. స‌రిపోలేద‌నుకొంటే.. ప‌క్క‌న పెట్టి, మ‌రో హీరోతో చేద్దాం” అనుకొన్నార్ట‌. ఈ విష‌యం తెలిసి కూడా.. ఈ సినిమాలో న‌టించ‌డానికి శ‌ర్వా ముందుకొచ్చాడ‌ట‌. అప్పుడే శ‌ర్వానంద్ ఆటిట్యూడ్ త‌న‌కు బాగా అర్థ‌మైంద‌ని, ఆ సినిమాతో శ‌ర్వా అభిమానిగా మారిపోయాన‌ని చెప్పుకొచ్చాడు ప్ర‌భాస్‌. ఈ సంద‌ర్భంగా శ‌ర్వాని కాబోయే సూప‌ర్ స్టార్ అని అభివర్ణించ‌డం విశేషం. ”శ‌ర్వా మా ఇంటి హీరో.. కాబోయే సూప‌ర్ స్టార్‌” అంటూ శ‌ర్వాని పొగ‌డ్త‌ల‌తో ముంచేశాడు. శ‌ర్వానంద్ కూడా ఏం తీసిపోలేదు. ”నేను ఈ సినిమా వ‌ర‌కే మ‌హాను భావుడ్ని. ప్ర‌భాస్ నిజ జీవితంలోనూ మ‌హానుభావుడే” అన్నాడు. ”ఎదుటివాళ్ల మంచి కోరుకొనే వ్య‌క్తి ప్ర‌భాస్ అన్న‌. మ‌న‌కు న‌లుగురైదుగురు స్నేహితులుంటారు. ప్ర‌భాస్ అన్న‌కి మాత్రం పాతిక మంది ఉంటారు. నా సినిమా వ‌స్తోందంటే నా కంటే ఎక్కువ టెన్ష‌న్ ప‌డతాడు. త‌న‌కు ప్రేమించ‌డం త‌ప్ప ఇంకేం తెలీదు” అన్నాడు శ‌ర్వా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close