ఎన్టీఆర్ కోసం మూడు క‌థ‌లు… చివ‌రికి ఓకే చెప్పింది దేనికి?

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఈరోజే లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. సెట్స్‌పైకి వెళ్ల‌డానికి మాత్రం చాలా స‌మ‌యం ఉంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు త్రివిక్ర‌మ్‌. 2018 జ‌న‌వ‌రి 10న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఆ త‌ర‌వాతే ఎన్టీఆర్ సినిమా మొద‌ల‌వుతుంది. క‌థ విష‌యంలో ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఎన్టీఆర్ కోసం త్రివిక్ర‌మ్ మూడు క‌థ‌ల్ని సిద్ధం చేసిన‌ట్టు టాలీవుడ్ టాక్‌. ఓ క‌థ అయితే.. అందులో క‌థానాయ‌కుడ్ని అంధుడిగా చూపించాల‌నుకొన్నాడ‌ట‌. మ‌రోటి జ‌వాన్ త‌ర‌హా క‌థ అని తెలుస్తోంది. మూడో క‌థ‌… ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో సాగుతుంద‌ట‌. ఈమ‌ధ్యే ర‌వితేజ ‘రాజా ది గ్రేట్‌’లో అంధుడిగా క‌నిపించాడు. రాజ్ త‌రుణ్ కూడా ‘అంధ‌గాడు’లో ఆ పాత్రే చేస్తున్నాడు. అందుకే ఈ క‌థ‌ని ఎన్టీఆర్ ప‌క్క‌న పెట్టేశాడ‌ట‌. జ‌వాన్ క‌థ‌పై కూడా ఎన్టీఆర్ ఆస‌క్తి చూపించ‌లేద‌ని తెలుస్తోంది. చివ‌రికి ఫ్యామిలీ డ్రామా క‌థ‌కే ఓటేశార్ట‌. కుటుంబ నేప‌థ్యంలో సినిమాల్ని తెర‌కెక్కించ‌డంలో సిద్ద‌హ‌స్తుడు త్రివిక్ర‌మ్‌. బృందావ‌నం త‌ర‌వాత ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న సినిమా ఏదీ చేయ‌లేదు ఎన్టీఆర్‌. అందుకే… ఈ క‌థ‌కే ఎన్టీఆర్ మొగ్గు చూపించాడ‌ని, ఇప్పుడు ఈ క‌థే తెర‌కెక్క‌బోతోంద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.