‘అదిరింది’… ఆగింది

తమిళ నాట సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న చిత్రం ‘మెర్శ‌ల్‌’. రికార్డుల హోరు, విమ‌ర్శ‌ల జోరుతో… ఈ సినిమా అక్క‌డ వార్త‌ల్లో నిలుస్తోంది. తెలుగులో ‘అదిరింది’ పేరుతో శ‌ర‌త్ మ‌రార్ విడుద‌ల చేస్తున్నారు. రేపు (శుక్ర‌వారం) విడుద‌ల తేదీ ప్ర‌క‌టించారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ సెన్సార్ క్లియ‌రెన్స్ రాలేదు. జీఎస్టీ, నోట్ల రద్దు, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల దుస్థితిని ఎండ‌గ‌డుతూ ఇందులో ప‌దునైన డైలాగులు వాడారు. అవే ఇప్పుడు బీజేపీ నేత‌ల కోప‌తాపాల‌కు కార‌ణం అవుతున్నాయి. ఈ సినిమాని ఆపేయాల‌ని, డైలాగుల్ని క‌త్తిరించాల‌ని త‌మిళ నాట నిర‌శ‌న‌లు రోజురోజుకీ ఎక్కువ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలుగు సెన్సార్ క‌ష్ట‌మ‌వుతోంది. ఆయా స‌న్నివేశాల్ని తొలగిస్తే తెలుగులో సెన్సార్ స‌ర్టిఫికెట్ మంజూరు చేస్తామ‌ని సెన్సార్ అధికారులు చెబుతున్నారు. అయితే అందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లు అంగీక‌రించ‌డం లేదు. దాంతో ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. త‌మిళంలో సెన్సార్ అయిన సినిమాని తెలుగులో ఎలా ఆపుతారు?? అనేది చిత్ర‌బృందం ప్ర‌శ్న‌. సెన్సార్ వాళ్లూ, ద‌ర్శ‌క నిర్మాత‌లూ వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో అదిరింది ఆగిపోయింది. ఈ సెన్సార్ వ్య‌వ‌హారం తేలే వ‌ర‌కూ ‘అదిరింది’ తెలుగులో విడుద‌ల‌య్యే ఛాన్స్ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close