చుక్కా రామయ్యకి గృహ నిర్బంధమా!

వరంగల్ ఎన్కౌంటర్ కి నిరసనగా తెలంగాణాలోని వివిధ ప్రజా సంఘాలు, వామ పక్షాలు కలిసి తెలంగాణా ప్రజాస్వామిక వేదిక నేతృత్వంలో ఈరోజు ‘ఛలో అసెంబ్లీ’ పేరిట అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కారణంగా వారి కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టేందుకు వామపక్షాలు సిద్దపడుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి పోలీసులు నిజాం కాలేజీ, ఉస్మానియా విశ్వవిద్యాలయ హాస్టళ్ళలో తనికీలు నిర్వహించి కొందరు విద్యార్ధులను అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య కూడా వామపక్షాలకు మద్దతు ప్రకటించడంతో పోలీసులు ఆయనను కూడా గృహ నిర్భందం చేసారు. నగరంలోకి ప్రవేశించే అన్ని మార్గాలలో పోలీసులు తాత్కాలిక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నగరంలోకి వస్తున్న వాహనాలను తనికీలు చేసిన తరువాతనే లోపలకి ప్రవేశించేందుకు అనుమతిస్తున్నారు.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని తామెన్నడూ ఊహించలేక పోయామని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. ఒకానొకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన ఏవిధంగా ఉందో కేసీఆర్ పరిపాలన కూడా ఇప్పుడు అలాగే సాగుతోందని అభిప్రాయం వ్యక్తం చేసారు. శాంతియుతంగా చేపడుతున్న తమ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు తెలంగాణా ప్రభుత్వం ఇన్ని వేలమంది పోలీసులను ఉపయోగించడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని విరసం నేత వరవరరావు అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close