తెలంగాణలో సీన్ రివర్స్

ఒక్క దెబ్బకు సీన్ మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నిజానికి, ఓటుకు నోటు కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డిని ఓ ఆట ఆడుకోవాలని కొందరు తెరాస సభ్యులు భావించినట్టు తెలుస్తోంది. మీడియా ప్రతినిధులతో ఆఫ్ ది రికార్డుగా కొందరు నేతలు చెప్పిన మాటలివి. మొన్నటి వరకూ రేవంత్ సభకు రాలేదు. సోదరుడి మరణం కారణంగా ఆయన ఇన్ని రోజులూ సభకు దూరంగా ఉన్నారు. సోమవారం సభకు వచ్చిన రేవంత్ రెడ్డిని తెరాస సభ్యులు ఏమేరకు ఇరుకున పెడతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే, రైతుల సమస్య, రుణమాఫీ అంశంతో రేవంత్ వ్యవహారం వెనక్కి వెళ్లింది. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద పెద్ద ఎత్తున నినాదాలతో నిరసన తెలపడంతో అధికార పక్షం చికాకు పడింది. కేసీఆర్ కు కోపం వచ్చింది. రెండు రోజులు సుదీర్ఘంగా చర్చించిన అంశంపై మళ్లీ విపక్షం పట్టుబట్టడంతో సహజంగానే ముఖ్యమంత్రికి విసుగనిపించింది.

విపక్ష సభ్యులు ఎంతకూ మాట వినకపోవడంతో సస్పెన్షన్ అస్త్రాన్ని బయటకు తీశారు హరీష్ రావు. అంతే, జరగాల్సింది జరిగిపోయింది. రుణమాఫీ ఒకేసారి చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ చర్యను ఫోకస్ చేయడం ద్వారా, ప్రభుత్వం రైతు వ్యతిరేకి అనే ముద్ర వేయడానికి ప్రతిపక్షాల చేతికి అస్త్రాన్ని ఇచ్చినట్టయింది. ఒకేసారి రుణమాఫీ డిమాండ్ పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ ఊరూవాడా ప్రచారం చేయడానికి ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అంతటితో ఆగకుండా ఈనెల 10న తెలంగాణ బంద్ జరపాలని కూడా నిర్ణయించారు. ఒక్క దెబ్బతో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి, తెరాస మిత్ర పక్షం మజ్లిస్ మినహా.

అధికార పార్టీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తారని పేరున్న సీఎల్పీ నాయకుడు జానారెడ్డి కూడా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఇన్ని ప్రతిపక్షాలు ఒక అంశంపై కలిసికట్టుగా ఈ స్థాయిలో పోరాడటం ఇటీవలి కాలంలో అరుదైన విషయం. అందులోనూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టులు కలిసి రావడం మామూలు విషయం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందున్న ఆప్షన్లు రెండు. ఒకటి, ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్టు ఒకేసారి రుణమాఫీకి ఒప్పుకోవడం. రెండు, ప్రతిపక్షాల డిమాండ్ ను పట్టించుకోక పోవడం. రెండో పని చేస్తే రైతుల దృష్టిలో చెడ్డపేరు రావచ్చు. మొదటి పని చేసినా, క్రెడిట్ విపక్షాల ఖాతాలోకి పోవచ్చు. మరి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close