భారత్ లో రూ.6000 కోట్ల ఐ ఫోన్ల అమ్మకం?

యాపిల్ ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ కోసం చాలా మంది ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 16వ తేదీన వీటి అమ్మకం మొదలవుతుంది. అప్పుడే ప్రీ బుకింగ్ జోరందుకుంది. భారత్ లో కనీసం 10 లక్షల యూనిట్లను అమ్మాలని యాపిల్ టార్గెట్ గా పెట్టుకుంది. మొత్తం మీద దాదాపు 6000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇందులో కనీసం సగం ఆన్ లైన్ ఇ రిటైల్ మార్గంలో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీని వల్ల ఆఫ్ లైన్ మార్కెట్లో దుకాణదారులు కృత్రిమ కొరత సృష్టించడం, బ్లాకులో అమ్మడం వంటి సమస్య ఉండదు.

యాపిల్ కొత్త మోడల్ ఐఫోన్ల ధరలు రూ. 62 వేల నుంచి 92 వేల వరకు ఉన్నాయి. 16 జి బి ఫోన్ల ధర 62 వేలు. 128 జి బి ఐఫోన్ 6ఎస్ ప్లస్ ధర 92 వేలుగా నిర్ణయించారు. యాపిల్ ఐఫోన్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఒక్క పే టీఎం 150 నుంచి 200 కోట్ల ఆదాయం ఆర్జించడానికి ప్లాన్ చేస్తోంది. ఐ ఫోన్ 6ఎస్ బుకింగ్ కు క్రోమా వెయ్యి రూపాయలు చార్జి చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ గురువారం రాత్రి నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. యాపిల్ కు అతిపెద్ద భాగస్వామి స్నాప్ డీల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది.

మొత్తానికి సంపన్నులే కాదు, ఎగువ మధ్య తరగతి ప్రజలు, ముఖ్యంగా యూత్ ఈ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇది చేతిలో ఉంటేనే స్టేటస్ సింబల్ అవుతుందనే టాక్ వచ్చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

నామా కేంద్ర మంత్రి – కాంగ్రెస్ కూటమి సర్కార్‌లోనా ?

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎవరితో ఉంటారో ఇంకా ప్రకటించలేదు ..కానీ ఆయన మాత్రం ఓ ప్లాన్ తో ఉన్నారు. నామా నాగేశ్వరరరావును కేంద్ర మంత్రిని చేయాలనుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి...

మరోసారి అభాసుపాలైన హరీష్ ..!!

సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుస సవాళ్ళు విసిరి నవ్వులపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మరోసారి అభాసుపాలు అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని, ఆలస్యం చేయకుండా రేవంత్...

ఓటేస్తున్నారా ? : పోలవరం వైపు ఓ సారి చూడండి !

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కరువులో నిండా మునిగిపోవాలో.. కనీసం రైతుల కడుపు నింపుకోవాలో తేల్చుకోవాల్సిన సంధి స్థితిలో ఉంది. ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. గతంలో ఓట్లు వేశారు. ఐదేళ్లలో ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close