రాముడికి రాముడే శత్రువు !

వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. ఒక రాముడికి మరో రాముడంటే పడదు. ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకుంటున్నారు. విజయం సాధించడానికోసం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అవును, అక్కడంతా చిత్రంగానే ఉంది. అక్కడ కృష్ణుడికీ శివునికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కుంతీదేవి సైతం యుద్ధరంగంలోకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. రామాయణం, మహాభారతంలో ఎన్నడూ వినని శతృత్వాలూ, కక్షలూ, కార్పణ్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకీ ఆ స్థలం ఏదంటే…

అది బిహార్. అవును, అక్కడే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటివిడత పోలింగ్ అక్టోబర్ 12న నిర్వహిస్తున్నారు. 243 నియోజకవర్గాలకు ఐదు విడతలుగా పోలింగ్ జరుగుతుందక్కడ. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఈ యుద్ధంలో పాల్గొనే అభ్యర్ధులు (బరిలో ఉన్న అభ్యర్థుల)పేర్లు గమనిస్తుంటే చిత్రంగానే అనిపిస్తోంది. అభ్యర్థుల పేర్లలో రామ్, లక్ష్మణ్, కృష్ణ, శ్యామ్, శివ్, శత్రుఘన్, అర్జున్, కుంతీదేవి, శకుని, సుభాష్ చంద్రబోస్, ప్రహ్లాద వంటి వారు ఉన్నారు. ఇందులో ఒక రాముడు మరో రాముడితో పోటీకి దిగాల్సివచ్చింది. ఒక కృష్ణుడు శివునితో తలపడుతున్నాడు. ఎందుకంటే, రామాయణ, మహాభారతంలోని పాత్రలే వారి పేర్లు కావడమే ఈ పరిస్థితికి కారణం. వీరందరిలోకి రామ్ పేరు పెట్టుకున్న అభ్యర్థులే ఎక్కువమంది కావడం రామభక్తి స్థాయిని చాటిచెబుతోంది.

మొత్తం 243 నియోజకవర్గాల్లో రాముడనే అభ్యర్థి లేకుండా ఒక్కచోటు లేదంటే నమ్మండి. బిజేపీ ఆభ్యర్థుల పేర్లు రామ్ అని ఉంటే ఎవ్వరూ ఏమీఅనుకోరేమోగానీ, చివరకు వామపక్ష అభ్యర్థుల్లో కూడా రాముళ్లుండటం విశేషం. బీజేపీ అభ్యర్థుల పేర్లు చూస్తుంటే సుమారు ఓ పాతికమంది రామ్ పేరుతో ఉన్నవారే. ఒక చోట రాంజీ, మరో చోట రాంసుందర్, ఇంకోచోట రామానంద్, వేరో చోట రామ్ లఖన్ సింగ్…ఇలా ఇంకొంతమంది రామశబ్ద అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

సరే, శకుని పేరు పెట్టుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. మరి అలాంటి పేరుతో ఎన్నికల బరిలోకి దిగింది ఎక్కడని వెతికితే ఆ పేరూ కనిపించింది. జితన్ రామ్ మాంఝీ ఆధ్వర్యంలో ఏర్పాటైన హిందుస్తానీ అవాం మోర్చా (హెచ్ఎఎం) రాష్ట్రశాఖ అధ్యక్షుని పేరు శకుని చౌదరి. ఆయన తారాపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. ఇక సికందరా నియోజకవర్గం నుంచి ఎల్ జేపీ (లోక్ జనశక్తి పార్టీ) అభ్యర్థిగా సుభాష్ చంద్రబోస్ బరిలో ఉన్నారు.

ఇతిహాస నామధేయులను బరిలో దింపడంలో మహాకూటమి కూడా వెనుకంజవేయలేదు. జెడీయు అభ్యర్థుల లిస్ట్ లో రామానంద్, రాంచంద్రప్రసాద్, రమేరాం, రాంసేవక్ సింగ్ వంటి వారు ఉన్నారు. శ్యామ్, కృష్ణ, శత్రుఘ్న వంటివారు కూడా బరిలోఉన్నారు.లాలూప్రసాద్ కి చెందిన ఆర్ జేడీలో ప్రహ్లాద్ యాదవ్, కుంతీదేవి, రామానుజ్ ప్రసాద్, విష్ణు సింగ్, లక్ష్మీనారాయణ్, సీతారాం యాదవ్ వంటి పురాణపురుష నామధేయులు సైతం బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాందేవ్ రాయ్, మంగళ్ రాం, సురేంద్ర రాం వంటివారు ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.

ఐదు దశలుగా జరిగే బిహార్ ఎన్నికల సమరంలో చివరి విడత పోలింగ్ నవంబర్ 5తో ముగుస్తుంది. ఫలితాలు నవంబర్ 8న వెల్లడవుతాయి. హిందూత్వభావన కేవలం బీజేపీలోనేకాదు, అన్నిపార్టీల్లోనూ ఉందని ఈ అభ్యర్థులపేర్లు చూస్తుంటే అర్థమవడంలేదూ…సరే, రాముడిపై రాముడే తలపడితే, ఏ రాముడు గెలుస్తాడో, మరే రాముడికి ఓటమి ఎదురవుతుందో…ఎన్నికల రామలీల ఎలాఉందో చూద్దాం.

-కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close