మోడీకి లాలూ ప్రసాద్ యాదవ్ సవాల్!

కొండకు వెంట్రుక ముడేసి లాగితే కొండ రాదు వెంట్రుకే తెగిపోతుందని అందరికీ తెలుసు అయినా కూడా ఏదో ఆశ. అందుకే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు సాధారణంగా ఏదో ఒక సమస్యని ఎత్తి చూపించి “మేము రాజీనామాకు సిద్దం మీరు రాజీనామాకు సిద్దమేనా?” అంటూ అధికారపార్టీకి సవాళ్లు విసురుతుంటారు. ప్రత్యేక హోదా కోసం వైకాపా నేతలు తెదేపాకి అటువంటి సవాలే విసిరారు. తెలంగాణాలో విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యల సమస్యలపై ప్రతిపక్షాలు తెరాసకు అటువంటి సవాలే విసిరాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మోడీని డ్డీ కొనలేక చతికిలపడిపోయిన ఆర్.జే.డీ. అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా మోడీకి అటువంటి సవాలే విసిరారు. “ఒకవేళ బీహార్ ఎన్నికలలో బీజేపీ ఓడిపోయినట్లయితే నరేంద్ర మోడి తన పదవికి రాజీనామా చేస్తారా?” అని సవాల్ విసిరారు. బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించకపోవడంతోనే తన ఓటమిని అంగీకరించినట్లయిందని లాలూ ఎద్దేవా చేసారు.

అయితే అటువంటి సవాళ్ళను పట్టించుకొంటే మోడీయే కాదు ఎవరూ అధికారంలో స్థిరంగా ఉండలేరని లాలూ ప్రసాద్ యాదవ్ కి కూడా తెలుసు. ఇదివరకు ఒకసారి లాలూ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు…కానీ అది ప్రతిపక్షాలు సవాలు చేసినందుకు కాదు… జైలుకి వెళ్ళవలసి వచ్చినప్పుడు. అప్పుడు కూడా తన చేతిలో నుండి అధికారం చేజారిపోకుండా జాగ్రత్తపడుతూ తన భార్య రబ్రీదేవిని తన కుర్చీలో కూర్చోబెట్టి మరీ జైలుకి వెళ్ళారు. ఆ తరువాత అక్కడి నుండే ప్రభుత్వాన్ని నడిపించారు కూడా.

అవినీతి కేసులో నాలుగేళ్ళు జైలు శిక్షపడినందున ఎన్నికలలో పోటీ చేసేందుకు, అధికారం చేప్పట్టేందుకు కూడా అర్హత కోల్పోయిన లాలూ ప్రసాద్ యాదవ్ తన పార్టీ తరపున వందమంది అభ్యర్ధులను బరిలో నిలబెట్టి వారి ద్వారా అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఒకవేళ తను నిలబెట్టిన అభ్యర్ధులు ఎన్నికలలో ఓడిపోయినా ఆయనకు కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ బీజేపీ ఓడిపోతే మాత్రం నరేంద్ర మోడికి చాలా ఇబ్బందికరమే కానీ అంతమాత్రాన్న ఆయన తన పదవికి రాజీనామా చేయాలని లాలూ ప్రసాద్ యాదవ్ కోరడం హాస్యాస్పదమే. బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్ధి పదవికి బీజేపీ దాని మిత్ర పక్షాలలో నలుగురు అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. వారిలో ఎవరి పేరు ప్రకటించినా మిగిలినవారు ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉంటుంది కనుకనే బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్ధిపేరును ముందుగా ప్రకటించలేదు. అంతే తప్ప లాలూ ప్రసాద్ యాదవ్ చెపుతున్నట్లుగా ఓటమిని అంగీకరించి కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close