జగన్ బీజేపీకి గాలం విసిరితే కాంగ్రెస్ పడింది!

జగన్ తన దీక్ష ద్వారా రాష్ట్రంలో తనకున్న ప్రజాధారణ, తన పార్టీ బలం బీజేపీకి చూపించుకొని దానిని తనవైపు తిప్పుకోవాలని ఆశించి ఉండవచ్చును. దానిని బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకొన్నట్లు లేదు. జగన్ బీజేపీకి గాలం విసిరితే దానికి కాంగ్రెస్ తగులుకొంది. జగన్మోహన్ రెడ్డికున్న ప్రజాధారణ, అతని పార్టీ శక్తిని కాంగ్రెస్ అధిష్టానం బాగానే గుర్తించినట్లుంది. అందుకే జగన్ దీక్షకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ వైకాపాతో కలిసి పోరాడేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తే కాంగ్రెస్ పార్టీని ఆయన చేతుల్లో పెట్టేందుకు సిద్దంగా ఉందని సూచిస్తున్నట్లుంది.

పదేళ్ళ పాటు సమైక్య రాష్ట్రంలో చక్రం తిప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎక్కడా అంతగా కనబడటం లేదు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉందో లేదో తెలియని స్థితి నెలకొని ఉంది. కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి బ్రతించుకోవాలంటే దానిని జగన్ చేతిలో పెట్టడమే మంచిదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందేమో? అయినా దానికి ఇంతకంటే వేరే మంచి మార్గం లేదు కూడా. కానీ అందుకు జగన్ అంగీకరిస్తారో లేదో మున్ముందు తెలుస్తుంది.

జగన్ ప్రయత్నలోపం లేకుండా ఎన్ని పోరాటాలు చేస్తున్నా ఏదీ విజయవంతం అవడం లేదు. అందుకు కారణం అధికార తెదేపా, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న ప్రతివ్యూహాలే. కాంగ్రెస్ పార్టీ నుండి బొత్స సత్యనారాయణ వంటి రాజకీయ అనుభవజ్ఞుడు వచ్చి జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపినప్పటికీ తెదేపా ముందు వారి ఎత్తులు పనిచేయడం లేదు. ఆ సంగతి మొన్న నిరాహార దీక్ష విఫలం అవ్వడంతో మరోమారు రుజువయింది. కనుక ఇటువంటి పరిస్థితుల్లో జగన్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినట్లయితే అతని పోరాటాలకి కాంగ్రెస్ అండ దొరుకుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో మళ్ళీ ప్రాణం పోసుకొంటుంది. కానీ ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే వారు ఏవిధంగా స్పందిస్తారో అని జగన్ సందేహించనవసరం లేదు. ఎందుంటే కాంగ్రెస్ నేతలను తెదేపాలో చేర్చుకొన్నపటికీ దానిని ప్రజలు ఆదరించారు. కనుక దిగ్విజయ్ సింగ్ ఇస్తున్న ఈ ఆఫర్ ని జగన్ కన్సిడర్ చేయడమే మంచిదని చెప్పవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close