మహారాష్ట్రలో డ్యాన్స్ బార్స్ పై నిషేధం ఎత్తివేసిన సుప్రీం

సుమారు ఒక దశాబ్ద కాలంగా మహారాష్ట్రాలో డ్యాన్స్ బార్స్ పై నిషేధం కొనసాగుతోంది. దానిని ఈరోజు సుప్రీంకోర్టు ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. డాన్స్ బార్స్ పై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేస్తున్న డ్యాన్స్ బార్ మరియు డ్యాన్సర్స్ సంఘాలు సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తుంటే, ప్రతిపక్ష పార్టీలు అధికార బీజేపీ-శివసేన ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. 2005 సం.లో అప్పటి రాష్ట్ర హోం మంత్రిగా పనిచేసిన ఆర్.ఆర్. పాటిల్ రాష్ట్రంలో డ్యాన్స్ బార్స్ పై నిషేధం విధించారు. ఆ తరువాత అధికారం చేపట్టిన ముఖ్యమంత్రులు ఆ నిషేధాన్ని కొనసాగిస్తూ వచ్చేరు. కానీ మహారాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల కోసం పోరాడుతున్నామని చెప్పుకొనే శివసేన, హిందూ ధర్మ సంరక్షణకి పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడే బీజేపీ మహారాష్ట్రలో అధికారంలో ఉన్నప్పుడే ఈ అశ్లీల నృత్యాలపై సుప్రీంకోర్టు నిషేధం ఎత్తివేయడం చాలా విచిత్రం. బీజేపీ, శివసేనలకు చెందిన కొందరు నేతలు డ్యాన్స్ బార్స్ యజమానులతో కుమ్మక్కు అయినందునే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ కేసుపై గట్టిగా పోరాడలేదని ఎన్.సి.పి అధికార ప్రతినిధి నవాబ్ మల్లిక్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇంచుమించు అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. ఇప్పటికయినా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని సుప్రీం కోర్టులో మళ్ళీ మరో పిటిషన్ వేసి డ్యాన్స్ బార్స్ పై నిషేధం కొనసాగించవలసిందిగా అభ్యర్ధించమని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close