ఎన్నికల మధ్యలో ఫ్రంట్ లో నుంచి ఎన్.సి.పి జంప్?

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎప్పుడూ చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో కలిసి జనత పరివార్ తో జత కట్టిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి) లాలూ, నితీష్ చెరో వంద సీట్లు పన్సుసుకొని కాంగ్రెస్ కి 40 సీట్లిచ్చి మిగిలిన ముష్టి మూడు సీట్లు పడేయడంతో అలిగిన ఎన్.సి.పి, ములాయం సింగ్ తో జనతా పరివార్ నుండి బయటకి జంప్ అయిపోయింది. తరువాత ములాయం సింగ్ ని నమ్ముకొని మరో ఐదు లోకల్ పార్టీలు కూడా వచ్చి చేరడంతో ఆ గ్రూప్ కాస్తా తృతీయ ఫ్రంట్ అని ముద్దుపేరు పెట్టుకొని తాము కూడా జనతా పరివార్, ఎన్డీయే, వామపక్షాల కూతములకి ఏమాత్రం తీసిపోమని భుజాలు చరుచుకొంది. అంత వరకు బాగానే ఉంది. కానీ ఎన్నికల ప్రచార సమయంలో తమ తృతీయ ఫ్రంట్ కి ప్రచారం చేయవలసిన ములాయం సింగ్ బీజేపీకి ప్రచారం చేయడం మొదలుపెట్టేసరికి తృతీయ బ్యాచ్ షాక్ అయిపోయింది.

మొన్న జరిగిన ఎన్నికల ప్రచార సభలో ములాయం సింగ్ ప్రసంగిస్తూ “ఈసారి ఎన్నికలలో బీజేపీకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఆ పార్టీయే బీహార్ లో అధికారంలోకి రావచ్చని జోస్యం చెప్పారు. అంతకు ముందు మోడీ పాలనను, బీజేపీ జాతీయవాదానికి గుడ్ సర్టిఫికేట్ ఇచ్చేరు. ఇదంతా చూస్తుంటే ములాయం సింగ్ ఎన్నికల ప్రచారంలో మోడీకి, బీజేపీకి ఏజెంట్ గా పనిచేస్తున్నారా? మోడీ ఆదేశాలతోనే ఆయన తృతీయ ఫ్రంట్ కి ఈవిధంగా శల్యసారధ్యం చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది తృతీయ ఫ్రంట్ జనాలకి.

ములాయం సింగ్ కొడుతున్న ఈ కంకు దెబ్బలకి ఓర్చుకోలేక ఎన్.సి.పి తృతీయ ఫ్రంట్ లో నుంచి మళ్ళీ బయటకి జంప్ చేసేసింది. మేము కాంగ్రెస్, బీజేపీలకి వ్యతిరేకంగా పోరాదేందుకే ఈ తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసుకొంటే ములాయం సింగ్ మళ్ళీ ఆ బీజేపీకే వంత పాడటం మాకు డైజెస్ట్ అవ్వడం లేదు అని గుడ్ బై చెప్పేసింది. అయితే కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడాలనుకొన్న ఎన్.సి.పి మొదట అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి జనతా పరివార్ లో సిద్దాంతాలు, లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ఏవేవో పడికట్టు పదాలు చెప్పిన విషయం కన్వీనియంట్ గా మరిచిపోయిందిప్పుడు…అదే అసలు సిసలు రాజకీయ పార్టీ లక్షణం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close