కేసీఆర్ మెడపైనా సీబీఐ కత్తి?

అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ కూడా చేరిపోయారు. దసరాకు ముందురోజే సీబీఐ అధికారులు ఓ పాత కేసుకు సంబంధించి కేసీఆర్ ను ప్రశ్నించడం విశేషం. ఇప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేసిన పలువురు నేతలపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. వీరిలో హర్యానా, బీహార్ మాజీ ముఖ్యమంత్రులకు ఇప్పటికే జైలు శిక్ష పడింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కూడా జైలు శిక్ష పడింది. అయితే సుప్రీంకోర్టు ఆమె నిర్దోషి అని తీర్పు చెప్పింది.

కేసీఆర్ యూపీఏ కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇ ఎస్ ఐ ఆస్పత్రుల నిర్మాణ కాంట్రాక్టును ఫిషరీస్ డిపార్ట్ మెంట్ కు ఇవ్వడం వల్ల ఖజానాకు 6 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని కేసు నమోదైంది. ఈ విషయంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపడంపై సీబీఐ అధికారులు దృష్టి పెట్టారు. దీనిపై మొదట మత్స్యశాఖ ప్రాథమిక విచారణ తర్వాత సీబీఐలోని అవినీతి నిరోధక విభాగానికి కేసు నమోదు చేశారు. అలా, 2011లో కేసు సీబీఐ చేతికి వచ్చింది.

సదరు ఆస్పత్రుల నిర్మాణ కాంట్రాక్టును మొదట కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించారు. నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ కు కేటాయించిన కాంట్రాక్టును రద్దు చేసి, ఫిషరీస్ శాఖకు అప్పగించడంపై సీబీఐ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించినట్టు సమాచారం. కేసీఆర్ అప్పుడెప్పుడో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేసు సీబీఐ చేతికి వెళ్లి కూడా చాలా కాలమైంది. హటాత్తుగా ఇప్పుడు కేసీఆర్ ను ప్రశ్నించడం గమనార్హం. ఓ వైపు ఓటుకు నోటు కేసు దుమారం రేపింది. టీడీపీ ఎమ్మెల్యే ఇప్పటికే అరెస్టయి బెయిల్ పై విడుదలయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా నోటీసు ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ సమయంలో సీబీఐ అధికారులు పాత కేసు దర్యాప్తునకు రంగంలోకి దిగడమే విశేషం.

కేసీఆర్ అవినీతి మరక లేని నాయకుడని, కాబట్టి సీబీఐ కేసు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు తెరాస నేతలు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలోనే అవినీతిని సహించేది లేదని చాలా సార్లు స్పష్టంగా ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈ కేసు నిలవదని, కేసీఆర్ కు ఏ ఇబ్బందీ లేదని అనుచరులు ధీమాగా చెప్తున్నారు. అయితే రాజకీయ ప్రత్యర్థులు ఈ కేసును కారణంగా చూపి ఆరోపణల దాడి చేయవచ్చని భావిస్తున్నారు. అలాంటి ఆరోపణలు వస్తే దీటుగా ఎదుర్కొంటామంటున్నాయి గులాబీ శ్రేణులు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close