ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య ఎంతకాలం సాగుతుంది?

కారణాలు ఎవయితేనేమి మళ్ళీ చాలా కాలం తరువాత ఆంధ్రా, తెలంగాణా రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కనబడుతోంది. అయితే ఆ సయోధ్య ఎంత కాలం నిలుస్తుందనే అనుమానాలు అందరికీ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణాలో తెదేపా నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ ని తీవ్రంగా విమర్శిస్తూ, ఆయన ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే ఆయన అదేమీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడుతో స్నేహంగా ఉంటారని ఉండాలని ఆశించడం అత్యసే అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు కేసీఆర్ తో స్నేహమే కోరుకొంటున్నారు కనుక తెలంగాణాలో తన పార్టీ నేతలని కేసీఆర్ కి విరుద్దంగా పోవద్దని లేదా తమ జోరు తగ్గించుకోమని కోరవలసి ఉంటుంది. ఇంతవరకు తెరాసతో భీకర యుద్ధం చేస్తూ, ఇప్పుడు హటాత్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తెరాస ప్రభుత్వం పట్ల తెలంగాణా తెదేపా నేతలు స్నేహపూర్వకంగా మెలగమని కోరడం కూడా అత్యాశ అవుతుంది. తెరాసతో శత్రుత్వమే తప్ప ఎటువంటి పొత్తులు, స్నేహ సంబంధాలు లేనప్పుడు దానితో తెదేపా నేతలు స్నేహపూర్వకంగా మెలిగితే అప్పుడు వారికీ వైకాపాకి తేడా ఉండదు. అప్పుడు వారు కూడా తెలంగాణాలో తమ ఉనికి కోల్పోక తప్పదు. అటువంటి పరిస్థితులని వారు కోరుకోరు చంద్రబాబు నాయుడు కూడా కోరుకోరు కనుక యధాప్రకారం తెలంగాణాలో తెదేపా నేతలు తెరాసతో తమ యుద్ధం కొనసాగించవలసి ఉంటుంది. అదే జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ఇదివరకులాగే వ్యవహరించక తప్పదు. అప్పుడు పరిస్థితులు మళ్ళీ మొదటికి వస్తాయి. ఈ సమస్యకు కనిపిస్తున్న ఏకైక పరిష్కారం తెలంగాణాలో తెదేపా, తెరాస, బీజేపీలు మూడు కలిసి మిత్రపక్షాలుగా కొనసాగడమే. కానీ అది సాధ్యమేనా? ఆలోచించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close