ఉప ఎన్నికల ముందు సిబీఐ విచారణ తెరాసకి ఇబ్బందే

సరిగ్గా వరంగల్ ఉప ఎన్నికలు జరుగబోయే సమయంలో సిబీఐ అధికారులు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒక కేసు విషయంలో ప్రశ్నించడం తెరాసకు చాలా ఇబ్బందికరంగా మారింది. 2006సం.లో ఆయన కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ.ఎస్.ఐ. ఆసుపత్రుల నిర్మాణానికి సంబంధిత కేంద్ర ప్రభుత్వ సంస్థకు బాధ్యతలు అప్పగించకుండా విశాఖలోని మత్స్యశాఖలో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారికి బాధ్యతలు అప్పగించారు. ఈకేసుపై దర్యాప్తు చేస్తున్న సిబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చి ఆయనను ప్రశ్నించి వెళ్ళారు. ఆయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే మరొక వివాదాస్పద నిర్ణయం కూడా తీసుకొన్నారు.నిబంధనలకు విరుద్దంగా సహారా సంస్థకు స్వంతంగా ప్రావిడెంట్ ఫండ్ నిర్వహణ చేసుకోవడానికి అనుమతించారు.దానిపై కూడా సిబిఐ విచారణ జరుగుతోంది.

ఇంతకాలం తెరాస నేతలు కాంగ్రెస్, తెదేపాలు అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించేవారు. ఓటుకి నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసారు. కానీ వారి ఎత్తులకు ఆయన వేసిన పైఎత్తులు వేయడంతో వారి పధకం ఫలించలేదు.ఇప్పుడు తమ ముఖ్యమంత్రే అంతకంటే పెద్ద కేసులో ఇరుక్కోవడంతో తెరాస నేతలకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది.

తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఇదే విషయం లేవనెత్తి సిబీఐ విచారణపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఈ కేసులో ఆయన ప్రమేయం ఉందా…లేదా? అనే విషయం ప్రకటించాలని డిమాండ్ చేసారు. ఒకవేళ తమ ప్రశ్నకు జవాబు చెప్పకుండా మౌనం వహిస్తే కేసీఆర్ అవినీతికి పాల్పడినట్లుగానే భావిస్తామని అన్నారు. తెదేపా, బీజేపీ, వామ పక్షాలు కూడా ఈ విషయంలో కేసీఆర్ సంజాయిషీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు తెరాస నేతలెవరూ జవాబు చెప్పుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ అంశం తప్పకుండా ప్రస్తావించడం ఖాయం. అదే జరిగితే తెరాస నష్టపోవచ్చును. కనుక నేడో రేపో దీనిపై కేసీఆర్ లేదా తెరాస ముఖ్యనేతలు ఎవరో ఒకరు ప్రజలకు వివరణ ఇచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close