కాంగ్రెస్ కోసం సర్వే బలవబోతున్నారా?

వరంగల్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తరపున మొదట సిరిసిల్ల రాజయ్యను అనుకొన్నా నిన్న రాత్రి ఆయన ఇంట్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆయన కోడలు సారిక, ఆమె ముగ్గురు చిన్నారి పిల్లలు అనుమానాస్పద స్థితిలో సజీవ దహనం అవడంతో ఆయన ఇక పోటీ చేసే పరిస్థితిలో లేరు. ఒకవేళ ఆయన అందుకు సిద్దపడినా కాంగ్రెస్ పార్టీ అంగీకరించి ఉండేదే కాదు. కనుక ఆయన స్థానంలో సర్వే సత్యనారాయణను బరిలోకి దింపుతోంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో నామినేషన్లు వేసేందుకు గడువు ముగుస్తుంది కనుక ఆయన మరికొద్ది సేపటిలో తన నామినేషన్ వేయబోతున్నారు.

ఈ ఉప ఎన్నికలలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని మొదటి నుంచి ధీమా వ్యక్తం చేస్తున్న తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజయ్య ఇంటిలో జరిగిన ఈ ఘోర దుర్ఘటన తమ విజయావకాశాలపై ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని అంగీకరించారు. అంటే రాజయ్యకి బదులుగా ఎన్నికలలో పోటీకి దిగుతున్న సర్వే సత్యనారాయణ నష్టపోయే అవకాశాలున్నాయని ముందే అంగీకరించినట్లు భావించవచ్చును. రాజయ్యను కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపిక చేసినప్పటికే కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఎందుకంటే తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తున్న దయాకర్ వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న గాలి వినోద్ కుమార్ ఇద్దరూ కూడా కాంగ్రెస్, ఎన్డీయే అభ్యర్ధులతో పోల్చితే యువకులే పైగా వరంగల్ నియోజక వర్గ ప్రజలకు చిరపరిచితులు. ఇప్పుడు రాజయ్య స్థానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి సర్వే సత్యనారాయణకి వరంగల్ నియోజక వర్గంపై అంత పట్టు లేదు. పైగా రాజయ్య ఇంట్లో జరిగిన దుర్ఘటన ప్రభావం కూడా ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా చెపుతున్నారు. అంటే పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయని భావించవచ్చును. కనుక కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను కాపాడటం కోసమే బరిలోకి దిగుతున్న సర్వే సత్యనారాయణ ఈ ఎన్నికలలో బలవుతున్నరేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆఖరి నిమిషంలో జరిగిన ఈ పరిణామాల వలన అధికార తెరాస అభ్యర్ధికి అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close