ఏపీ సర్కారుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు

హైదరాబాద్: అమరావతిలో రాజధాని నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. రాజధాని నిర్మాణానికి లభించినట్లు చెబుతున్న పర్యావరణ అనుమతులను అన్‌లైన్‌‍లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఆన్‌లైన్‌లో పెట్టలేకపోయామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులు చెప్పారు. వాటిని తమముందుకూడా పెట్టాలని ట్రిబ్యునల్ సూచించింది. ఆన్‌లైన్‌లోకూడా పెట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని సీఆర్‌డీఏను ఆదేశించింది. తడినేలలను, ముంపు ప్రాంతాలను గుర్తించారా అని అడిగింది. దానిపై సీఆర్‌డీఏ నివేదిక సమర్పించింది.

మరోవైపు పర్యావరణ అనుమతులు లభించేవరకు అమరావతిలో ఎటువంటి కార్యక్రమమూ జరపకూడదని స్టే ఉన్నాకూడా, శంకుస్థాపన జరిపారంటూ ఇవాళ ట్రిబ్యునల్‌లో కోర్ట్ ధిక్కార పిటిషన్ దాఖలయింది. దీనిపై వారంలోగా సమాధానం చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి, సీఆర్‌డీఏకు, కేంద్ర పట్టణాభివృద్ధి, పర్యావరణ శాఖలకు ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను ఈనెల 19కు వాయిదా వేసింది. అమరావతి నిర్మాణంలో ఎన్నో ఎకరాల సారవంతమైన భూమిని పాడుచేస్తున్నారని, లక్షల సంఖ్యలో చెట్లను కొట్టేస్తున్నారని పర్యావరణ చట్టాలను, నిబంధనలను పాటించటంలేదని ఆరోపిస్తూ పండలనేని శ్రీమన్నారాయణ అనే సీనియర్ జర్నలిస్ట్ సుప్రీం కోర్ట్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన పేరుమీద వైఎస్ఆర్ కాంగ్రెస్సే ఈ కేసును వేయించిందనే ఆరోపణలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close