ఇదిగో… చైనా నిజస్వరూపం

ప్రపంచానికి కమ్యూనిజం పాఠాలు చెప్పే చైనా, అవినీతిలో బాగా పండిపోయింది. ఈ విషయంలో చాలా కాలంగా లోకానికి తెలుసు. అక్కడి ప్రభుత్వం మాత్రం నంగనాచి కబుర్లు చెప్తుంది. ఇప్పుడు కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఈ విషయాన్ని ఘంటాపథంగా బయటపెట్టింది. మనకంటే చైనాలో అవినీతి మరీ దారుణమట.

అతి తక్కువ అవినీతి ఉన్న దేశాల్లో డెన్మార్క్ నెంబర్ వన్ గా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, స్విట్జర్లాండ్, సింగపూర్ నెదర్లాండ్స్, లక్సెంబర్గ్, కెనడాలు టాప్ 10లో ఉన్నాయి.

భారత్ 85వ ర్యాంక్ పొందింది. చైనా 100వ స్థానంలో నిలిచింది, పాకిస్తాన్ లో అవినీతి మరీ ఎక్కువ. అందుకే ఆ దేశం 126వ ర్యాంక్ పొందింది. భారత్ లో అవినీతి స్వల్పంగా తగ్గిందని తాజా నివేదిక తెలిపింది. చైనాలో అవినీతి అనకొండలా వ్యాపించిందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కమ్యూనిస్టు దేశం కాబట్టి వివరాలు బయటకు రానివ్వలేదు. అయితే గత కొన్నేళ్లుగా అవినీతి ఆరోపణలపై అక్కడి ప్రభుత్వం చాలా మందికి కఠిన శిక్షలు విధించింది.

పేరుకు కమ్యూనిస్టు దేశమైనా, జరిగేదంతా రాచరికాన్ని తలపించే నిరంకుశ పాలన. ప్రజలు నోరెత్తే వీలులేదు. ప్రయివేటు మీడియాకు అవకాశం లేదు. ప్రజలు నచ్చిన వారికి ఓటేసే వీలే లేదు. పైగా, క్యాపిటలిస్టు విధానాన్ని పెద్ద ఎత్తున అవలంబించే దేశం చైనా. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో విదేశీ, స్వదేశీ కంపెనీలకు రాయితీలిచ్చి, భారీగా లాభాలు దండుకోవడానికి చైనా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అందుకే అక్కడ మిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగింది. కమ్యూనిస్టు సిద్ధాంతానికి విరుద్ధంగా పెట్టుబడిదారులు ఆడింది ఆటగా మారింది. అవినీతి భారీగా పెరిగింది. ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిన సంకేతాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close