రాజీనామా చేసేస్తా జాగ్రత్త! వైకాపా ఎమ్మెల్యే

విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే వెనక్కు తీసుకోవాలని వైకాపా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని డిమాండ్ చేసారు. ఆమె తన అనుచరులతో కలిసి బాక్సైట్ తవ్వకాలు జరుపబోయే ప్రాంతాన్ని నిన్న సందర్శించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “ఈ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయకపోతే త్వరలో జరుగబోయే శాసనసభ సమావేశాలలో నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడి నుండే పోటీ చేసి ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని రుజువు చేస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నాతో పోటీకి వచ్చినా ఆయనను ఎదుర్కోవడానికి నేను సిద్దం. లేకుంటే తెదేపాలో ఎవరు పోటీ చేసినా నేను రెడీ. బాక్సైట్ తవ్వకాలు అజెండాగా ఉప ఎన్నికలు జరిపించుదాము. ఒకవేళ తెదేపా అభ్యర్ధి నా చేతిలో ఓడిపోయినట్లయితే చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయాలి. ఒకవేళ తెదేపాకు అంత దైర్యం లేకపోతే తక్షణమే బాక్సైట్ తవ్వకాల ఆలోచన విరమించుకోవాలి,” అని అన్నారు.

ఆమె మాటలు వింటే ఆమె బాక్సైట్ తవ్వకాలకువ్యతిరేకంగా పోరాడాలని అనుకొంటున్నారా లేక తమా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని పోరాడాలనుకొంటున్నారా? అనే అనుమానం కలుగుతోంది. ఆమె ఎవరో రాష్ట్ర ప్రజలెవ్వరికీ తెలియదు కానీ ఆమె ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని తనతో పోటీ చేయమని కోరడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close