శ్రీదేవి అడిగింది..శృతి హాసన్ వదులుకుంది..!

కోలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్ అంతా పులి సినిమా నిర్మాతల మీద శ్రీదేవి చేసిన ఆరోపణలే.. సౌత్లో సూపర్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలను సంపాధించి బోని కపూర్ మ్యారేజ్ తర్వాత సౌత్ సినిమాలకు దూరమైన శ్రీదేవిని విజయ్ పులి సినిమా కోసం బాగా కష్టపడి, భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరి తీసుకున్నారు. సినిమా రిలీజే నానా హంగామాల నడుమ అయ్యి అది కాస్త అభిమానులను నిరాశ పరిచింది. దాదాపు 100 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.

అయితే ఇది చాలదు అన్నట్టు తనకు ఇంకా పులి నిర్మాతలు 50 లక్షలు ఇవాలని కొద్దిరోజుల క్రితం శ్రీదేవి ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆమెకు అనుకున్న రెమ్యునరేషన్ తో పాటుగా ఆమెతో పాటు స్పెషల్ గా ఆమె కోసం వచ్చిన కేర్ టేకర్స్ కి అయిన ఖర్చంతా కలిపి ఇంకా శ్రీదేవి ఎదురు బాకీ ఉందని తేల్చి చెప్పారు పులి నిర్మాతలు. అయితే ఎందుకొచ్చిన గొడవ అనుకున్న శ్రీదేవి ఆ విషయంలో వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడు పులి నిర్మాతలకు తన వంతు సాయం చేస్తుంది శృతి హాసన్. రెమ్యునరేషన్ తాలుఖు తనకు లాస్ట్ గా ఇచ్చిన చెక్ 25 లక్షల రూపాయలది తను తిరిగి ఇచ్చేందుకు సిద్ధమైందట.

సినిమా నష్టాల్లో తాను కూడా పాలుపంచుకుంటున్నానని గర్వంగా చెప్పింది శృతి హాసన్. అయితే సినిమా నష్టాలు మిగిల్చిన సంగతి తెలిసినా శ్రీదేవి రావాల్సిన పారితోషికం డిమాండ్ చేయడం చూసి అంతా విస్మయానికి గురయ్యారు. కాని శృతి హాసన్ మాత్రం నిర్మాత కష్టాన్ని చూసి తనకు రావాల్సిన 25 లక్షలను స్వతహగా వదులుకుని తన మంచి తనాన్ని చాటుకుంది. తండ్రి కమల్ హాసన్ దర్శక నిర్మాత కాబట్టి ఒక నిర్మాత కష్టాన్ని అర్ధం చేసుకోగల మంచి మనసు శృతి హాసన్ కి వచ్చిందని అందరు మెచ్చుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close