హిట్ కాంబినేషన్ రిపీట్..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ మొదట స్టార్ట్ అయిన సినిమా ‘రేయ్’ అయినా సరే రిలీజ్ అయిన సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సూపర్ హిట్ అయ్యింది. బహుశా రేయ్ సినిమా ముందు రిలీజ్ కాకపోవడం సాయికి కలిసి వచ్చిందని అనాలి. రీసెంట్ గా వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా కూడా బాగా సేల్ అవ్వడంతో మూడు సినిమాలకే కుర్రాడు సుప్రీం హీరో అయ్యాడు. ప్రస్తుతం దిల్ రాకు బ్యానర్లోనే సుప్రీం సినిమా చేస్తున్నా సాయి ధరం తేజ మరో సినిమా కూడా శ్రీకారం చుట్టాడు. అనీల్ రావిపూడి డైరక్షన్లో సుప్రీంలో నటిస్తున్న సాయి మరో పక్క తిక్క సినిమా కూడా చేస్తున్నాడు.

అయితే తనకు పిల్లా నువ్వు లేని జీవితం లాంటి మొదటి హిట్ ఇచ్చిన రవికుమార్ డైరక్షన్లో మరో సినిమా చేయడానికి సన్నద్దమయ్యాడు సాయి ధరం తేజ్. రవికుమార్ గోపి చంద్ హీరోగా సౌఖ్యం మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా సినిమా ఓకే చేశాడు. ఆ రెండిటి తర్వాత మళ్లీ సాయితో టీం అప్ అవుతున్నాడు రవి కుమార్ చౌదరి. రిపీట్ అవుతున్న ఈ హిట్ కాంబినేషన్ ఎలాంటి సినిమా చేస్తుందో చూడాలి.

ప్రస్తుతం సాయి ధరం తేజ్ సుప్రీం షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అది కంప్లీట్ అయ్యాక తిక్క దాని తర్వాత రవి కుమార్ సినిమా చేస్తాడట. కెరియర్ ఫుల్ జోష్ లో సాగుతున్న సాయికి రాబోయే సినిమాలన్ని సూపర్ హిట్స్ కావాలని కోరుకుందాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close