వారిద్దరిలా వీరిద్దరు కూడా..!

బాలీవుడ్ స్టార్ డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలి ప్రస్తుతం తీస్తున్న సినిమా బాజీరావ్ మస్తాని. వారియర్ కింగ్ బాజీరావ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు దర్శక నిర్మాత భన్సాలి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో 2002లో తీసిన దేవదాస్ సినిమాలో ‘డోలారే.. డోలారే..’ సాంగ్ లాంటిదే బాజీరావ్ మస్తాని సినిమాలో కూడా పెడుతున్నాడట దర్శక నిర్మాత భన్సాలి.

దేవదాస్ సినిమాలో డోలారే సాంగ్ ఎంత హైలెట్ గా నిలిచిందో అందరికి తెలిసిందే. అప్పట్లో క్రేజీ హీరోయిన్స్ మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్ లు ఆ పాటలో పోటీ పడి మరి అభినయం కనబరిచారు. ఇప్పుడు అదే రేంజ్లో బాజీరావ్ మస్తాని సినిమాలో కూడా ఆ టైప్ సాంగ్ ఒకటి పెడుతున్నాడు భన్సాలీ. బాలీవుడ్ హాట్ గాళ్స్ అయిన ప్రియాంకా చోప్రా, దీపికా పదుకునేలు ఈ పాటలో నర్తిస్తున్నారు.

120 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ టైటిల్ రోల్ చేస్తున్నాడు. బాలీవుడ్ బాహుబలిగా రాబోతున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో సినిమా వస్తేనే గాని చెప్పలేం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close