బాబు – కేసీఆర్: ఇద్దరినీ ఉతికి ఆరేసిన సురవరం!

హైదరాబాద్: సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ – ఇద్దరినీ కడిగి పారేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి తీవ్రస్థాయిలో పెరుగుతోందన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, కేసీఆర్ చేసిన వాగ్దానాల్లో ఒక్క శాతంకూడా అమలు చేయలేదని ఆరోపించారు. చంద్రబాబు తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారని, ఆయనకు అన్నింటికంటే డబ్బుపైనే ఎక్కువ విశ్వాసముందని అన్నారు. బాబు దగ్గర ప్రతిదానికీ ఒక రేటు ఉందని విమర్శించారు. కోటీశ్వరులకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు, శత కోటీశ్వరులకు కేంద్రంలో, రాష్ట్ర మంత్రి పదవులు కట్టబెట్టారని, వీరిలో కొందరు అసలు టీడీపీలోనే లేరని, అటువంటి వారికి పదవులు దక్కాయని మండిపడ్డారు. ఇప్పటికిప్పుడు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే గతంలో గెలిచిన సీట్లలో సగంకూడా టీడీపీకి రావన్నారు. బీజేపీని చంద్రబాబు తన మెడకు చుట్టుకోవటంతో టీడీపీ, బీజేపీ రెండూ మునగటం ఖాయమని చెప్పారు.

మరోవైపు కేసీఆర్‌ పాలనపై స్పందిస్తూ, చంద్రబాబుకు కొంచెెం పొలిటికల్ కల్చర్ ఉందని, కేసీఆర్‌కైతే అదికూడా లేదని సురవరం విమర్శించారు. పరిపాలనలో భాగంగా వివిధ విషయాలపై చంద్రబాబు తన కేబినెట్ అనుచరులు, పార్టీ నాయకులతో చర్చిస్తున్నట్లు కనిపిస్తోందని, కేసీఆర్‌లో కనీసం ఆ సంస్కారంకూడా లేదని అన్నారు. అందుకే ఆయన పార్టీకి, ప్రజలకు, సహచరులకు దూరమవుతున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడి తరహాలో తనకు తోచిన విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. తమ బలహీనతల గురించి బాబుకు, కేసీఆర్‌కు పూర్తిగా తెలుసని, ఆ కారణంగానే ప్రజల బలహీనతలపై దెబ్బకొట్టి పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా పట్టించుకోకుండా ఇద్దరు ముఖ్యమంత్రులూ లౌకిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు.

సీపీఐ అగ్ర నాయకుడు సురవరం కొంతకాలంగా చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. సీపీఐ నారాయణ చంద్రబాబుపై మెతకవైఖరి ప్రదర్శిస్తుండగా సురవరం మాత్రం విరుద్ధంగా వెళ్ళటం విశేషం. మరోవైపు సురవరం బాబు, కేసీఆర్‌పై ఈ విమర్శలన్నీ సాక్షి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేశారు. సురవరం కుమారుడు సాక్షి గ్రూప్‌లో ఒక కీలక పదవిలో ఉన్నారని సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close