మేనల్లుడు చింటూయే యముడు

చిత్తూరు నగర మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ లపై ఈరోజు జరిగిన హత్యా ప్రయత్నంలో అనురాధ అక్కడికక్కడే మరణించగా, మోహన్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆయన కొద్ది సేపటి క్రితమే స్పృహలోకి వచ్చినట్లు సమాచారం. ఈ హత్యకు మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ (చింటూ) కారణమని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. చింటూ తరచూ మోహన్ న్ని డబ్బు కావాలని అడుగుతుండేవాడు. దానితో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కొన్ని రోజుల క్రితం చింటూ తనకి రూ.3లక్షలు కావాలని మోహన్ న్ని అడిగినప్పుడు ఆయన ఇవ్వకపోవడంతో, అప్పుడే ఈ హత్యాయత్నానికి పధకం వేశాడు. అతనికి వెంకటా చలపతి, రెడ్డప్ప, వెంకటేష్, మంజూనాధ అనే నలుగురు వ్యక్తులు సహకరించారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు బురకాలు ధరించి, మేయర్ చాంభర్ లో ప్రవేశించి మేయర్ అనురాధ, అక్కడే ఉన్న ఆమె భర్త మోహన్ పై కాల్పులు జరిపి పారిపోయారు.

ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే పారిపోయిన వారిలో ఇద్దరు దుండగులు పోలీసులకి లొంగి పోయారు. వారు ఎవరో పోలీసులు ఇంకా ప్రకటించలేదు. అలాగే ఈ హత్యకు ప్రధాన సూత్రధారి చింటూ లొంగిపోయిన వారిలో ఉన్నడా..లేక అతను కూడా పరారిలో ఉన్నడా? అనే విషయం ఇంకా పోలీసులు ప్రకటించలేదు. పోలీస్ జాగిలాలు పోలీసులను నేరుగా చింటూ ఇంటికే తీసుకువెళ్ళాయి. మేయర్ హత్యతో ఆవేశంతో ఊగిపోతున్న తెదేపా శ్రేణులు చింటూ ఇంటిపై దాడి చేసి ఇంట్లో వస్తువులను, బయట నిలిపి ఉంచిన మూడు వాహనాలను ద్వంసం చేసారు. ప్రస్తుతం చిత్తూరులో తీవ్ర ఉదిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు. తప్పించుకొని పారిపోయిన మిగిలిన ముగ్గురి కోసం పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. వారు చెన్నై వైపు పారిపోయి ఉంటారనే అనుమానంతో చెన్నై పోలీసులకు వారి వివరాలు తెలియజేసి వారి సహకారం కూడా తీసుకొంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close