జాక్‌పాట్ కొట్టిన రాజ్ తరుణ్

హైదరాబాద్: టాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో వర్ధమాన హీరోలు సాయి ధరమ్‌ తేజ్, రాజ్‌ తరుణ్ కొద్ది కాలంలోనే మంచి రేంజ్‌లోకి వెళ్ళిపోయారు. సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యామిలీ అండతో వచ్చాడు… కానీ రాజ్ తరుణ్ ఎవరి అండా లేకుండానే మంచి రేంజ్‌లోకి వెళ్ళి పోవటం విశేషం. మొదటి చిత్రం ‘ఉయ్యాల-జంపాల’ హిట్ అయినాకూడా ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ఇష్టమొచ్చినట్లు చిత్రాలను ఒప్పుకోకుండా, ఆచి తూచి అతను చిత్రాలను ఎంచుకుంటున్నాడు. అందుకనే రెండో చిత్రం ‘సినిమా చూపిస్త మావ’ కూడా హిట్ అయింది. అగ్ర దర్శకుడు సుకుమార్ నిర్మాణంలో రాజ్ తరుణ్ మూడో చిత్రం ‘కుమారి 21F’ విడుదలకు సిద్ధమయింది. ఇదిలా ఉంటే, సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో కూడా రాజ్ తరుణ్ బుక్ అయ్యాడు. గీతా ఆర్ట్స్ అంటేనే హయ్యెస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యానర్ అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ బ్యానర్‌లో భలే భలే మగాడివోయ్ అనే హిట్ వచ్చింది. అలాంటి బ్యానర్‌లో బుక్ అయ్యి రాజ్ తరుణ్ జాక్ పాట్ కొట్టేశాడు. దీనితో పాటు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలోకూడా చేయబోతున్నాడు. లేడీస్ టైలర్ సీక్వెల్‌లో వంశీ దర్శకత్వంలో నటించబోతున్నాడు. మంచు విష్ణుతో కలిసి ఓ మల్టీ స్టారర్ చిత్రంలో చేయబోతున్నట్లు చెప్పాడు. ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ అనే చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మొత్తం మీద రాజ్ తరుణ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

అల్ల‌రోడికి కాస్త ఊర‌ట‌

అల్ల‌రి న‌రేష్ 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై వ‌చ్చిన‌వ‌న్నీ నెగిటీవ్ రివ్యూలే. ఈవీవీ సూప‌ర్ హిట్ టైటిల్ ని చెడ‌గొట్టార‌ని, కామెడీ ఏమాత్రం పండ‌లేద‌ని విశ్లేష‌కులు...

మరో డీఐజీ రెడ్డి గారికి ఊస్టింగ్ ఆర్డర్స్

పోలింగ్ కు ముందు వైసీపీ అరాచకాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న పోలీసు అధికారులపై ఈసీ గట్టిగానే గురి పెట్టింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఆయనకు ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close