ధ‌నుష్‌ థ్రిల్లింగ్‌ పెర్ఫామెన్స్‌తో `మ‌రియ‌న్‌` బాక్సాఫీస్ హిట్ సాధించింది

ధనుష్‌ హీరోగా, పార్వతీ మీనన్‌ హీరోయిన్‌గా భరత్‌బాల దర్శకత్వంలో ఆస్కార్‌ ఫిలింస్‌ ప్రై. లి. పతాకంపై ప్రముఖ నిర్మాత ఆస్కార్‌ వి. రవిచంద్రన్‌ తమిళంలో నిర్మించిన ‘మరియన్‌’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్న సి.జె.శోభ ఇప్పుడు ఎస్‌.వి.ఆర్‌.మీడియా ప‌తాకంపై మరో విభిన్న చిత్రం ‘మరియన్‌’ను తెలుగులో అందించారు. నవంబర్‌ 20న రిలీజైన ఈసినిమా థియేట‌ర్ల‌లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ధ‌నుష్ మైండ్‌బ్లోవింగ్ పెర్ఫామెన్స్‌, ఏ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం ఈ సినిమాకి పెద్ద అస్సెట్ అయ్యాయ‌ని చెబుతున్నారు నిర్మాత శోభ‌.

స‌క్సెస్‌ సందర్భంగా నిర్మాత సి.జె.శోభ మాట్లాడుతూ – ”మా ఎస్వీఆర్‌ మీడియా బ్యానర్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాం. ఇప్పుడు ‘మరియన్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాం. ఎప్పుడూ డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకునే ధనుష్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఒక అద్భుతమైన క్యారెక్టర్‌ చేసి మెప్పించారు. ధనుష్‌ పెర్ఫామెన్స్‌కి అద్భుత స్పందన వస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ అందించిన సంగీతం స్పెషల్‌ హైలైట్‌ గా నిలిచింది. ఒక యదార్థ సంఘటన ఆధారంగా భరత్‌బాల రూపొందించిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతోంది. తమిళ్‌లో ఆస్కార్‌ రవిచంద్రన్‌గారు నిర్మించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని సాధించింది. తెలుగు ప్రేక్షకుల నుంచి అంతే చక్కని స్పందన వచ్చింది. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు” అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష 2’ సెట్లో గొడ‌వ జ‌రిగిందా?

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. రోజుకో నిజం బ‌య‌ట‌కు వ‌స్తోంది. జానీ మాస్ట‌ర్‌కూ బాధితురాలికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని ఓ పెద్ద హీరో ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుకుమార్...

ఆ ప్రజాగ్రహ ఓటులోనే బూడిదయ్యారు జగన్ గారూ !

జగన్ రెడ్డి ఓడిపోయినా ఇసుమంత కూడా మారలేదని తనను వదిలి పోతున్న పార్టీ నేతల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. ఎవరు పోయినా పర్వాలేదని.. ప్రజల...

కుక్కలకు వల వేశారు.. కాంతి రాణా కోర్టుకెళ్లారు !

హీరోయిన్ జెత్వానీ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డెహ్రాడూన్ లో దాక్కుని తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న ఆయనపై నిఘా పెట్టి పోలీసులు పట్టుకున్నారు....

బీజేపీ నేతలు మనుషులైతే చంద్రబాబును తిట్టాలి : జగన్

జగన్ రెడ్డి బీజేపీ నేతలకు పెద్ద టెస్టే పెట్టారు. బీజేపీ నేతలు .. మనషులు అయితే చంద్రబాబును తిట్టాలట. బహుశా.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు .. తనకు గిలిగింతలు పెట్టడానికి అందరూ తిట్టారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close