లాలూని కట్టడి చేయడం మొదలుపెట్టిన నితీష్?

సాధారణంగా కొత్తగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రులు మొట్ట మొదట ప్రభుత్వ ఉన్నతాధికారులతో, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమవడం, తమ ప్రాధాన్యతల గురించి వారికి చెప్పడం జరుగుతుంటుంది. నిన్న మళ్ళీ ఐదవసారి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్ కూడా అదే పని చేసారు. ఆయన రాష్ట్ర ఉన్నత స్థాయి పోలీస్ అధికారులతో తన మొట్టమొదటి అధికారిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో నిర్వహించారు. ఆ సమావేశంలో రాష్ట్రంలోని పోలీస్ ఐ.జి., డి.ఐ.జి.,ఎస్.పి.,డి.ఎస్.పి. స్థాయి పోలీస్ అధికారులు అందరూ పాల్గొన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి తను అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నానని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. శాంతి భద్రతలు విషయంలో ఎవరూ రాజీపడినా సహించనని స్పష్టంగా చెప్పారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న వారెవరినీ వారు ఎంతటి వారయినా ఉపేక్షించనవసరం లేదని వారిని నేరస్తులుగానే పరిగణించి చట్ట ప్రకారం వారిపై కటినమయిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో పోలీసులు అందరూ చట్టాన్ని చాలా ఖచ్చితంగా అమలుచేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎవరు అలసత్వం వహించినా సహించబోనని అందరినీ హెచ్చరించారు.

నితీష్ కుమార్ తన మొట్టమొదటి అధికారిక సమావేశం రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో నిర్వహించడం చాల సర్వ సాదారణమయిన విషయంలాగే పైకి కనబడుతున్నపటికీ, ఆయన తమ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న “లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ సన్స్” ని ఇప్పటి నుండే పూర్తిగా కట్టడి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు భావించవచ్చును. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ రాష్ట్రాన్ని పరిపాలించినపుడు రాష్ట్రం అన్ని విధాల అధోగతి పాలయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, హత్యలు, కిడ్నాపులు జరుగుతుండేవి. రాష్ట్రంలో అరాచకం, అధికారులలో అవినీతి, అసమర్ధత కళ్ళకు కట్టినట్లు కనబడుతుండేవి. దానినే మోడీ, అమిత్ షాలు ‘ఆటవిక రాజ్యం’గా అభివర్ణించారు.

ఆ తరువాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్, చాలా కష్టపడి రాష్ట్రంలో ఆ పరిస్థితులనన్నిటినీ చక్కదిద్ది, మళ్ళీ అన్ని వ్యవస్థలను గాడిన పెట్టారు. కానీ మళ్ళీ లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ కో ఇప్పుడు అధికారంలోకి వచ్చేరు కనుక మళ్ళీ అవే పరిస్థితులు పునరావృతం అవుతాయని నితీష్ కుమార్ కూడా భయపడుతున్నట్లున్నారు. అందుకే ఆయన హోం శాఖను తన వద్దే అట్టేబెట్టుకొని, మొట్ట మొదట పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యి శాంతి భద్రతల విషయంలో రాజీపడితే సహించనని, చట్టాన్ని ఉల్లంఘించే వారు “ఎంత పెద్దవారయినప్పటికీ” ఉపేక్షించవద్దని గట్టిగా హెచ్చరించారు.

ఆ హెచ్చరికలు తనను ఉద్దేశ్యించి చేసినవేనని బహుశః లాలూ ప్రసాద్ యాదవ్ కూడా గ్రహించే ఉంటారు. కానీ అధికారం చేతిలో ఉన్నపుడు కూడా ఎంతో కాలం చట్టాన్ని అతిక్రమించకుండా ఉండటం ఆయనకి చాలా కష్టం. కనుక ఏదో ఒకరోజు ఆయన చట్టాన్ని ఉల్లంఘించడం ఖాయం అప్పుడు నితీష్ కుమార్ ఏమి చేయాలో పాలుపోక మాసిన గెడ్డం గోక్కోవడం కూడా ఖాయం. ఇటువంటివి చూసే ఇల్లలకగానే పండగ కాదు…ముందుంది ముసళ్ళ పండగ..వంటి మాటలు పుట్టుకొచ్చాయని అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close