ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన చైనా బృందం

హైదరాబాద్: చైనా మంత్రి చెంగ్ ఫెంజియాంగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందం ఇవాళ ఏపీ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించింది. ఉద్దండ రాయనపాలెంలో శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని, రాయపూడిలోని పురాతన కట్టడాలను సభ్యులు పరిశీలించారు. తర్వాత వారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధిలో తమకు చైనాయే స్ఫూర్తి అన్నారు. కొత్త రాష్ట్రంలో పెట్టుబడులకు విశేష అవకాశాలున్నాయని చెప్పారు. చైనా సిల్క్ రోడ్ రూట్‌ను ఏపీలోని విశాఖపట్నం మీదగుండా తీసుకెళ్ళాలని చైనా మంత్రిని కోరినట్లు తెలిపారు. పెట్టుబడులకు షాంఘై తర్వాత అమరావతిని సెకండ్ హోమ్‌గా పరిగణించాలనికూడా అడిగినట్లు అనంతరం మాట్లాడిన చైనా మంత్రి చెంగ్, చంద్రబాబు చైనా పర్యటన అనంతరం చైనాతో ఏపీ సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో మరిన్ని చైనా సంస్థలకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, రావెల కిషోర్ బాబు పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధికి సహకరించటానికి చైనా ప్రభుత్వం హామీ ఇచ్చిందని కిషోర్ బాబు అన్నారు. చైనా సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం ఏపీకి ఉపయోగపడతాయని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close