ఈ విజయం కూడా తెరాసకు హెచ్చరిక వంటిదే!

వరంగల్ ఉప ఎన్నికలు ఎన్నికలలో తెరాస చాలా భారీ మెజార్టీతో విజయం సాధించబోతోంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అది తమ పరిపాలనను మెచ్చుకొని ప్రజలు గెలిపించారని చెప్పుకొంటే మాత్రం అతిశయంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికలు మొదలవకముందు వాటిని తెరాస ప్రభుత్వ పరిపాలనకు రిఫరెండంగా భావించాలని కాంగ్రెస్ కోరినప్పుడు తెరాస నేతలు ఆ సవాలును దైర్యంగా స్వీకరించలేకపోయారు. కాంగ్రెస్ విసిరిన ఆ సవాలును ఒకవేళ వారు స్వీకరించి ఉండి ఉంటే, ఇప్పుడు వారు ఎన్ని గొప్పలు చెప్పుకొన్నా విన సొంపుగా ఉండేది.

గత రెండు, మూడు వారాలుగా వరంగల్ లోక్ సభ పరిధిలో ఉన్న ఏడు నియోజక వర్గాలలో తెరాస తన మంత్రులను నేతలను, పార్టీ శ్రేణులను దించి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది. తెరాస నేతలు చేసిన ఆ ‘సమిష్టి కృషి’ కారణంగానే వరంగల్ ఉప ఎన్నికలలో ఆ పార్టీ ఘన విజయం సాధించబోతోంది. ఈ విషయం తెరాసకు తెలుసు, ఉప ఎన్నికలలో ఓడిపోతున్న ప్రతిపక్షాలకు తెలుసు. ఈ ఉప ఎన్నికలలో వైకాపా ఎందుకు ప్రవేశించిందో కూడా అందరికీ తెలుసు. ఒకవేళ తమ ప్రభుత్వ పనితీరు పట్ల తెరాస నేతలే సంతృప్తి కలిగి దాని పట్ల ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారని భావిస్తున్నట్లయితే ఈ ఉప ఎన్నికల కోసం వారు అంతగా చెమటోడ్చవలసిన అవసరమే ఉండేది కాదు. కానీ ఈ ఉప ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడవలసివచ్చింది. కనుక తెరాస ప్రభుత్వం ఈ ఉప ఎన్నికల ఫలితాలను చూసి మురిసిపోవడం కంటే, దీనినొక హెచ్చరికగా స్వీకరించి, ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తున్న తనలో లోపాలను సవరించుకొని ముందుకు వెళితే డానికే మంచిది. అలాకాక ఇది తమ నిజమయిన విజయమేనని ఆత్మవంచన చేసుకొంటే దాని వలన అదే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close