చండీయాగానికి 2-3 కోట్లు పెద్ద ఖర్చేమీ కాదు: కేసీఆర్

వచ్చే నెల 23వ తేదీ నుండి 27 వరకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాలోని తన వ్యసాయ క్షేత్రంలో ఆయుత చండీ యాగం చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దానిపై హేతువాద సంఘాలు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తేలికగా కొట్టి పడేశారు.

ఈరోజు తన పార్టీ నేతలతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ఈ యాగం చేస్తానని నేను మొక్కుకొన్నాను. అందుకే చేస్తున్నాను. దాని కోసం సుమారు రెండు మూడు కోట్లు ఖర్చవుతుందని నేను భావిస్తున్నాను. ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క పైసా కూడా నేను తీసుకోను. నా స్వార్జితం నుండే అంతా ఖర్చు చేస్తాను. తెలంగాణా రాష్ట్ర శ్రేయస్సు కోరి చేస్తున్న యాగం ఇది. కనుక ప్రతిపక్షాలు అనవసరమయిన విమర్శలు చేయడం మానుకొంటే మంచిది. డబ్బు సమస్య లేదు కానీ ఈ యాగం చేయడానికి సుమారు 4,000 మంది వేద పండితులు,1,500 మంది రిత్విక్కులు కావాలి. వారిని దేశంలో మూడు నాలుగు రాష్ట్రాల నుండి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాను,” అని అన్నారు.
ఈ యాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆహ్వానిస్తానని తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను ఈ యాగానికి ఆహ్వానించబోతున్నట్లు కేసీఆర్ తెలిపారు.

ఒకవైపు తెలంగాణాలో రైతులు ఆర్ధిక సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొంటుంటే, స్వంత డబ్బే అయినా రెండు మూడు కోట్లు ఖర్చు చేసి ఇంత ఆర్భాటంగా యాగం చేయడం సమంజసమేనా? సాటి మనిషిని పట్టించుకోకుండా ఎన్ని పూజలు యాగాలు చేస్తే మాత్రం ఏమి లాభం? అని హేతువాదులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు కూడా అదే ప్రశ్నిస్తున్నారు. కానీ వరంగల్ ఉప ఎన్నికలు ఘోర పరాజయంతో కలత చెందినవారు, తిరుగులేని మెజార్టీతో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న కేసీఆర్ ని వేలెత్తి చూపే సాహసం చేయలేకపోతున్నారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలోగా మళ్ళీ తేరుకొని కేసీఆర్ ప్రభుత్వంపై యుద్దానికి సిద్దం అవుతారేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవెంట్ కంపెనీ నిర్వాకం.. నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వ‌ల్ల‌, నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు మేట‌ర్...

క్రిష్ పేరు మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అది కూడా ఓకే. అయితే షాకింగ్ ఏమిటంటే......

పాయకరావుపేట రివ్యూ : వంగలపూడి అనితకు కలిసొస్తున్న కాలం !

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు,...

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కాలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close