సీఐడీపై సుప్రీంకోర్టుకెళ్లిన ఏబీఎన్, టీవీ5..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తమపై నమోదు చేసిన రాజద్రోహం కేసులు కుట్రపూరితమని.. తక్షణం ఆ కేసులపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలివ్వాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5 సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు టీవీ చానళ్లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. ఎంపీ రఘురామకృష్ణరాజు రచ్చబండ పేరుతో పెట్టే ప్రెస్‌మీట్లు టెలీకాస్ట్ చేశారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5లపై రాజద్రోహం కేసులను ఏపీసీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ స్వయంగా నమోదు చేశారు. ఆయనే ఫిర్యాదు దారు. ఆయనే విచారణాధికారి. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజును పుట్టినరోజు నాడే అరెస్ట్ చేశారు.

ఆ తర్వాత వైసీపీ నేతలు.. ఆ రెండు చానళ్ల యజమానులు లేదా కీలక ఉద్యోగుల్ని అరెస్ట్ చేస్తారని.. సోషల్ మీడియాలో బ్లాక్‌మెయిల్ తరహాలో బెదిరింపులు ప్రారంభించారు. రెండు సీఐడీ బృందాలు హైదరాబాద్‌లో ఉన్నాయని… తమకు అనుకూలంగా ఉండే మీడియాకు లీక్ ఇచ్చి ప్రచారం చేశారు. నిజానికి రెండు టీవీ చానళ్లపై కేసులు పెట్టిన అంశం… ఎఫ్ఐఆర్ బయటకు వచ్చే వరకూ తెలియదు. రఘురామరాజు మాట్లాడారని.. టీవీ చానళ్లు ప్రసారం చేశాయని.. ఇదంతా కుట్ర పూరితమని సీఐడీ చెప్పుకొచ్చింది. దీంతో మీడియాపైనా సీఐడీ కుట్ర పన్నిందన్న అభిప్రాయం వినిపించింది. ఈ క్రమంలో… ఈ రెండు చానళ్లు.. తమపై పెట్టిన కేసుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

నిజానికి రాజకీయ నేతలు మాట్లాడతారు.. టీవీ చానళ్లు ప్రసారం చేస్తాయి. అది వారికి ఉన్న స్వేచ్చ. ఇందులో కుట్ర ఏముందో..న్యాయస్థానాలే తేల్చాల్సి ఉంది. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా… టీవీల్లో ప్రసారం అయిన సీడీలనే ఆధారాలుగా పేర్కొంటూ.. సీఐడీ పెట్టిన కేసు.. ఇప్పుడు దేశ పత్రికా స్వేచ్చకు ఓ ప్రత్యేకమైన పరిస్థితి తీసుకు వచ్చింది. ఏబీఎన్, టీవీ5 చానళ్ల పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు రాజ్యాంగం ప్రకటించిన భావ ప్రకటనా స్వేచ్చ.. మీడియా స్వేచ్చకు అత్యంత కీలకమయ్యే అవకాశం ఉండనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close