ఆ నోటీసుల పరమార్ధం అదేనా?

ఓటుకి నోటు కేసుపై ఎసిబి అధికారులు ఇంకా ఎంత కాలం దర్యాప్తు చేసిన తరువాత దోషులెవరో కనిపెడతారో ఎవరికీ తెలియదు కానీ సుమారు మూడున్నర నెలల తరువాత కూడా నేటికీ ఎవరికో ఒకరికి నోటీసులు ఇస్తూనే ఉన్నారు. మొన్న నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన ఎసిబి అధికారులు ఈరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులకు నోటీసులు ఇచ్చారు. వారిలో శ్రీనివాసులు నాయుడు అనే వ్యక్తి ఒక మద్యం కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అని సమాచారం. చైతన్య, విష్ణు అనే మరో ఇద్దరికీ కూడా ఎసిబి అధికారులు నోటీసులు జారీ చేసి ఈ కేసులో విచారణకు మంగళవారం తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. వారికీ ఈ కేసుకి ఏవిధంగా సంబంధమో తెలియదు.

ఈ కేసులో ఎసిబి అధికారుల కంటే ముందే స్పందించిన తెరాస నేతలు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అసలు దోషి! అతనిని ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని ప్రగల్భాలు పలికేవారు. కానీ మూడున్నర నెలలు అవుతున్నా ఎసిబి అధికారులు ఆయనకి కనీసం నోటీసులు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పడం లేదు. తెరాస నేతలెవరూ ఇప్పుడు ఈ కేసు గురించే మాట్లాడటం మానేశారు. కానీ వారు ముందే చెప్పినట్లు చట్టం (ఏసిబి) తన పని తాను చేసుకుపోతున్నట్లుంది. మరి ఈ నోటీసుల పర్వం ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో, ఎప్పుడు అటకెక్కుతుందో వారికే తెలియాలి. కానీ తెదేపా నేతల మెడ మీద కత్తిలా వ్రేలాడుతున్న ఈ కేసులో నోటీసుల ఇవ్వడంలో పరమార్ధం మాత్రం వారిని ఆందోళనకి గురి చేస్తూ ఉంచడానికేనని భావించవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close