“కులం” కేసులో వీసీ దామోదరనాయుడు అరెస్ట్..!

ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ దామోదరనాయుడిని పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అరెస్ట్ చేశారు. దామోదరనాయుడు వద్ద గతంలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఓ అటెండర్ పని చేసేవారు. ఆయన విధులకు హాజరు కాకపోతూండటంతో.. తొలగించారు. ఆ తొలగించిన అటెండర్… దామోదరనాయుడు.. తనను కులం పేరుతో దూషించారని.. ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఆయనను అరెస్ట్ చేశారు. అయితే. దామోదరనాయుడు కులం పేరుతో దూషించింది.. యూనివర్శిటీలో కాదు.. సచివాలయంలో అని ఫిర్యాదుదారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. దామోదరనాయుడు సచివాలయానికి వస్తున్నారని తెలిసి… తన ఉద్యోగం గురించి అడిగేందుకు.. ఆ మాజీ అటెండర్ అక్కడకు వెళ్లారట. అక్కడ వీసీని పట్టుకుని తన ఉద్యోగం గురించి ప్రస్తావించడంతో.. కులం పేరుతో దూషించారని.. ఆయన ఫిర్యాదు చేశారు.

గవర్నర్ పర్యవేక్షణంలో ఉండే యూనివర్శిటీ వీసీని ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేయడం.. విద్యారంగంలో సంచలనాత్మకం అయింది. దామోదరనాయుడు ముక్కుసూటిగా ఉండే మనిషిని క్యాంపస్‌లో చెబుతూంటారు. ఆయన ప్రతీ విషయంలోనూ కఠినంగా ఉండటంతో.. చాలా మంది ఉద్యోగులకు వ్యతిరేకమయ్యారు. ప్రభుత్వం మారినప్పటి నుండి.. ఆయనపై.. అనేక ఫిర్యాదులు.. వెళ్లాయి. అనంతపురం జిల్లాకు చెందిన ఓ శాస్త్రవేత్త ఆధ్వర్యంలో పలువురు బోధన, బోధనేతర సిబ్బంది… కొత్త ప్రభుత్వంపై అనేక ఫిర్యాదులు చేశారు. దీనిపై.. ప్రభుత్వం విచారణ చేయించింది. వీసీ తీసుకుంటున్న చర్యలు నచ్చకే.. ఈ ఫిర్యాలు చేశారని ఆ విచారణలో తేలింది. ఆ తర్వాత గవర్నర్ కూ ఫిర్యాదు చేశారు. గవర్నర్ హరిచందన్ కూడా విచారణ జరిపించారు. ఈ నివేదిక ఇంకా బయటకు రాలేదు.

వర్శిటీలో అక్రమాలు… ఆయన తీరుపై.. వరుసగా ఫిర్యాదులు వస్తున్నా.. ఏ చర్యలు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో… తీసేసిన ఉద్యోగి ఫిర్యాదును.. ఉపయోగించుకుని అరెస్ట్ చేశారన్న విమర్శలు ఉన్నత విద్యారంగానికి చెందిన ప్రముఖుల్లో వినిపిస్తోంది. నిజానికి వైస్ చాన్సలర్ ను అరెస్ట్ చేయాలంటే.. ముందుగా గవర్నర్ కు సమాచారం ఇవ్వాల్సి ఉటుందని చెబుతున్నారు. గవర్నర్ అన్ని విశ్వవిద్యాలయాలకు చాన్సలర్ గా ఉంటారు. వీసీలను గవర్నరే నియమిస్తారు. ఈ క్రమంలో.. ఈ కేసు అందరిలోనూ ఆశ్చర్యానికి కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close