క‌థానాయిక‌లూ మేల్కొంటున్నారు!

క‌రోనా వ‌ల్ల జ‌న జీవితాలు అత‌లాకుత‌లం అయిపోయాయి. ఈ స‌మ‌యంలో నిరు పేద‌ల‌కు చేయూత నివ్వ‌డానికి సినీ రంగం ముందుకొచ్చింది. ఎవ‌రికి తోచిన రీతిలో వాళ్లు స‌హాయం చేస్తున్నారు. టాప్ హీరోల ద‌గ్గ‌ర్నుంచి, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల వ‌ర‌కూ త‌మ వంతు స‌హాయం అందించారు. అయితే హీరోయిన్లు మాత్రం ముందుకు రాలేదు. టాప్ హీరోయిన్లంతా క‌రోనా స‌హాయం విష‌యంలో మౌనంగా ఉన్నారు. అనుష్క‌, స‌మంత‌, త‌మ‌న్నా… వీళ్లంతా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి స‌హాయం అందించ‌లేదు. దాంతో క‌థానాయిక‌ల‌కు సామాజిక బాధ్య‌త లేదా? అంటూ విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ఇప్పుడు క‌థానాయిక‌లు ఒకొక్క‌రుగా ముందుకొస్తున్నారు. కాస్త ఆల‌స్యంగానైనా స్పందించ‌డం మొద‌లెట్టారు. న‌య‌న‌తార 20 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం ప్ర‌క‌టించింది. తమిళ సినీ కార్మికుల కోసం ఈ మొత్తం వెచ్చిస్తారు. ఇప్పుడు ర‌కుల్ కూడా ముందుకొచ్చింది. గుర్‌గావ్‌లోని త‌న ఇంటికి స‌మీపాన ఉన్న ఓ మురికివాడ‌లోని నిరు పేద‌ల‌కు ర‌కుల్ భోజ‌న స‌దుపాయం క‌ల్పిస్తోంది. ఈ రోజు నుంచి లాక్ డౌన్ ఎత్తేసే వ‌ర‌కూ అంటే… ఏప్రిల్ 14 వ‌ర‌కూ తాను వాళ్ల‌కు భోజ‌నం అందిస్తాన‌ని మాటిచ్చింది ర‌కుల్‌. వీళ్లంద‌రికంటే ముందు ప్ర‌ణీత రూ.1 ల‌క్ష విత‌ర‌ణ ప్ర‌క‌టించింది. చేతిలో సినిమాలు లేక‌పోయినా.. త‌న‌ని ఇప్పుడు ఎవ్వ‌రూ ప‌ట్టించుకోక‌పోయినా త‌న వంతు బాధ్య‌త‌గా, త‌న‌కు తోచిన స‌హాయం చేసింది ప్ర‌ణీత‌. మ‌రి కోట్ల‌కు కోట్లు సంపాదిస్తున్న స్టార్ హీరోయిన్ల‌కు మాత్రం ఆ మ‌న‌సు రాలేక‌పోయింది. ఇప్పుడైనా వాళ్ల స‌హాయం ప్ర‌క‌టిస్తే అంత‌కంటే కావ‌ల్సిందేముంది?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close