సజ్జల పరిశీలించారు.. ఇప్పుడు సీఎం వంతు !

సొంతజిల్లాను వరదలు అతలాకుతలం చేసినా పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించారు. రెండు, మూడు తేదీల్లో కడప జిల్లాతో పాటు నెల్లూరులోనూ క్షేత్ర స్థాయిలో పర్యటించి సమీక్షలు చేయనున్నారు. అసెంబ్లీలో తనపై వస్తున్న విమర్శలకు స్పందించి.. తాను అక్కడికి వెళ్తే సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని… ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎప్పుడైనా వరద బాధిత ప్రాంతాలకు వెళ్లారా అని ప్రశ్నించారు. ఇప్పుడు వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముగిసిపోయాయేమో కానీ ఆయన పర్యటించాలని నిర్ణయంచుకున్నారు.

సీఎం జగన్ పర్యటనకు ముందుగానే .. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయా ప్రాంతాల్లో పర్యటించి వచ్చారు. ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలో పార్టీ నేతలకు వివరించారు. కొన్ని చోట్ల ఆయనకు నిరసన సెగ తగిలింది. ముఖ్యమంత్రి పర్యటనలో అలాంటివేమీ ఉండకూడదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయ కార్యక్రమాలు గొప్పగా చేపట్టాలన్న అభినందనలు బాధితలు చెప్పేలా ఉండాలని ఆయన తమ పార్టీ వర్గాలకు.. అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే బాధితులు అందరికీ పరిహారం కాకుండా కొంత మందికే .. ఓ పార్టీ వారికే ఇచ్చారు. దీంతో పలు గ్రామాల్లో నిరసనలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఇతర పార్టీల వారిని హౌస్ అరెస్టులు చేసే అవకాశం ఉంది. అయితే … ఇప్పటి వరకూ అరకొరగా.. రూ. వెయ్యి.. రెండు వేలు మాత్రమే పరిహారం ఇచ్చిన అధికార యంత్రాగం..సీఎం జగన్ సమీక్ష తర్వాత భారీగా పరిహారం పెంచుతారని.. బాధితులు ఆశ పడుతున్నారు. ముఖ్యంగా పంట నష్టపోయిన రైతులు.. ఎకరానికి కనీసం రూ. ఇరవై వేలు సాయం చేయాలని కోరుతున్నారు. వీరి బాధలపై జగన్ స్పందించి నష్టపరిహారం పెంచింతే.. కొంత మేర వారు సంతృప్తి పడే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close