దిల్‌రాజు నుంచి మెగా మ‌ల్టీస్టార‌ర్‌

సీత‌మ్మ వాటిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాతో – మ‌ల్టీస్టార‌ర్ సంప్ర‌దాయానికి తెర లేపారు దిల్‌రాజు. ఆ త‌ర‌వాత టాలీవుడ్‌లో చాలా మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలొచ్చాయి. ఎఫ్ 2తో మ‌రోసారి ఇద్ద‌రు హీరోల్ని క‌లిపారు దిల్ రాజు. ఆ సినిమా వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌లోనే అత్య‌ధిక లాభాల్ని తీసుకొచ్చిన చిత్రంగా మిగిలింది. ఇప్పుడు ఆయ‌న మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కి రంగం సిద్థం చేస్తున్నారు.

ఈసారి మెగా మ‌ల్టీస్టార‌ర్‌కి ప్లాన్ చేశాడు దిల్ రాజు. వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌ల కోసం ఓ క‌థ సిద్ధ‌మైంద‌ని, త్వ‌ర‌లోనే ఈ సినిమాని ప‌ట్టాలెక్కించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. `ఎవ‌రు` సినిమాతో ఆక‌ట్టుకున్న వెంక‌ట్ రాంజీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. అయితే ఇటు వ‌రుణ్‌, అటు సాయిధ‌ర‌మ్ తేజ్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. వాళ్లిద్ద‌రి కాల్షీట్లూ కంబైంన్డ్‌గా దొరికిన‌ప్పుడు ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. ఈలోగా క‌థ‌ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకునే ప‌నిలో ఉన్నాడు రామ్‌జీ. ఇద్ద‌రు హీరోలు, అందునా మెగా హీరోలు క‌లిస్తే.. ఆ లెక్కే వేరుగా ఉంటుంది. మ‌రి ఈ మ‌ల్టీస్టార‌ర్ ఏ స్థాయిలో ఉండ‌బోతోందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close