ఎన్డీఏలో చేరాలని జగన్‌ను మోడీ ఆహ్వానించారా..?

దాదాపుగా నాలుగు నెలల తర్వాత ప్రధాని మోడీతో జగన్ సమావేశమయ్యారు. భేటీ దాదాపుగా యాభై నిమిషాల పాటు సాగింది. మామూలుగా షెడ్యూల్ ప్రకారం అయితే.. జగన్మోహన్ రెడ్డి వెంటనే అమరావతి బయలుదేరాల్సి ఉంది. కానీ అమిత్ షాతో కూడా సమావేశం కావాలని జగన్ నిర్ణయించుకోవడంతో.. అక్కడే ఉండిపోయారు. ఇక్కడే రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయం పాలైన రోజే.. జగన్‌కు మోదీ అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో.. ఇందులో రాజకీయ వ్యూహం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ నుంచి కేంద్ర కేబినెట్‌లో ఎవరూ లేరు. ప్రతీ రాష్ట్రానికి ఓ కేంద్రమంత్రి ఉండటం సంప్రదాయం. ఈ క్రమంలో.. వైసీపీని ఎన్డీఏలోకి తీసుకుంటారన్న ప్రచారమూ జరుగుతోంది. శివసేన ఎన్డీఏకు గుడ్ బై చెప్పడంతో.. ఆ స్థానాన్ని వైసీపీతో భర్తీ చేసుకుంటారని భావిస్తున్నారు. కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

మరో వైపు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అజెండాను… మండలి రద్దు విషయాన్ని ప్రధానాంశాలుగా చేసుకుని మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని స్పందన ఏమిటన్నదానిపై.. వివరాలు బయటకు తెలియడం లేదు. మోడీ సానుకూలంగా స్పందించి ఉంటే మాత్రం మాత్రం ఏపీ సర్కార్‌ రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా… కార్యాలయాల తరలింపు కోసం చేస్తున్న ప్రయత్నాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. మండలి రద్దు అంశం కూడా… ఈ తరలింపుతో ముడిపడి ఉంది. రద్దు బిల్లును పార్లమెంట్‌లో ఆమోదిస్తామని మోదీ హామిస్తే.. జగన్‌ కోరిక నెరవేరడం ఖయం.

ఇవాళ మంత్రివర్గ సమావేశంలో.. రాజధాని తరలింపునకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని జగన్ భావించినట్లుగా ప్రచారం జరిగింది. మండలిని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకు రావడమో… లేదా.. మండలిలో బిల్లులు పాసయిపోయినట్లుగా స్వయం ప్రకటన చేసి.. గవర్నర్‌కు పంపడమో చేయాలనుకున్నారు. కానీ.. హఠాత్తుగా ప్రధానితో భేటీ ఖరారు కావడంతో.. తాత్కలికంగా కేబినెట్ భేటీలో ఈ రాజధాని ఎజెండాను మాత్రం పక్కన పెట్టారు. మోడీ స్పందనను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జగన్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close