బడ్జెట్‌ తర్వాత విశాఖ నుంచే జగన్ పాలన..!

జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినట్లుగా… తాను ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అనే ఫార్ములాను ఫాలో అయిపోవాలని అంతిమంగా నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్మోహమాటంగా ప్రకటించారు. బడ్జెట్ తర్వాత ఏ క్షణం నుంచైనా సరే.. విశాఖ కేంద్రంగా చేసుకుని ముఖ్యమంత్రి పరిపాలన ప్రారంభిస్తారని ప్రకటించారు. హైకోర్టును కర్నూలుకు తరలించడం.. కార్యాలయాలను విశాఖకు తరలించడం అన్నీ పద్దతి ప్రకారం జరుగుతాయని ప్రకటించారు. ఓ వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. ప్రధానితో భేటీ అయిన సమయంలోనే పెద్దిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అవుతోంది. మూడు రాజధానుల అంశం ప్రస్తుతం పీటముడి పడింది. బిల్లులు శాసనమండలిలో ఉండిపోయాయి. అటు ఆమోదం పొందాయని చెప్పడానికి లేదు. ఇటు సెలక్ట్ కమిటీ పనిని ప్రభుత్వం అంగీకరించే పరిస్థితిలో లేదు.

పరిపాలనా సౌలభ్యం కోసం కార్యాలయాలను తరలిస్తున్నామని కోర్టులో చెబుతున్న వాదనలూ అంత తేలిగ్గా తేలే అవకాశం లేకపోవడంతో… తాను ఎక్కడి నుంచి పరిపాలన చేస్తే అదే రాజధాని అన్న విధానానికి ఫిక్సవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కోర్టులు కూడా.. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలన చేయాలని నిర్దేశించలేవు కాబట్టి.. అడ్డుకోలేరని ప్రభుత్వ వర్గాలుభావిస్తున్నాయి. కార్యాలయాల తరలింపు విషయంలో.. అన్నీ పద్దతి ప్రకారం జరుగుతాయని ప్రకటించడం వెనుక కూడా వ్యూహం ఉందంటున్నారు. కార్యాలయాల తరలింపు విషయంలో హైకోర్టు అనేక ప్రశ్నలు వేస్తోంది.

సచివాలయంలో స్థలం లేక విజిలెన్స్‌ను కర్నూలు తరలిస్తున్నామన్న ప్రభుత్వ వాదనను ధర్మానసం తప్పు పట్టింది. సచివాలయంలో స్థలం సరిపోకపోతే.. వేరే బిల్డింగ్‌లోకి మార్చుకోవచ్చుకదా అని ప్రశ్నించింది. సెక్రటేరియట్‌లో ఎంతమంది పనిచేస్తున్నారని ప్రశ్నించింది. విజిలెన్స్‌ ఆఫీస్‌ ఓచోట, ఉద్యోగులు మరో చోట ఉంటే పని ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఇవన్నీ కోర్టులో తేలే అంశాలు కాకపోవడంతో.. ముందుగా సీఎం.. తాను విశాఖ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close