జనవరి 1 నుంచి అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం

హైదరాబాద్: జనవరి 1 నుంచి అగ్రిగోల్డ్ గ్రూప్ ఆస్తులను వేలం వేయాలని ఈ కుంభకోణంపై ఏర్పాటైన రిటైర్డ్ జడ్జి సూర్యారావు కమిటీ హైకోర్ట్‌కు సూచించింది. ఈ కేసు ఇవాళ హైకోర్ట్‌లో విచారణకు వచ్చింది. సూర్యారావు కమిటీ సిఫార్సులను కోర్ట్ స్వీకరించింది. అగ్రిగోల్డ్‌పై మీడియాలో కథనాలను నిరోధించాలని సంస్థ తరపున న్యాయవాదులు హైకోర్ట్‌ను కోరారు. దీనికి కోర్ట్ నిరాకరించింది. ఈ కేసులో బాధితుల తరపున పిటిషన్ దాఖలు చేసిన రమేష్‌బాబు కూడా ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. మీడియా కథనాలవలనే ప్రజలలో చైతన్యం వచ్చిందని, ఆత్మహత్యలు ఆగాయని, బాధితులకు ఊరట కలిగిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం బినామీల పేరిట పెట్టిన ఆస్తుల వివరాలను తాము జడ్జికి తెలియజేశామని, వాటి విలువ రు.2,000 కోట్ల వరకు ఉంటుందని పిటిషనర్ చెప్పారు. అగ్రిగోల్డ్ యజమాని వెంకట్రామారావు – తన భార్య, పనివారు, డ్రైవర్‌లు తదితరుల పేరిట బినామీ ఆస్తులను రాశారని, వాటిని ఇప్పుడు విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు అగ్రిగోల్డ్ గ్రూప్ బినామీ ఆస్తుల రెండో జాబితాను మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజి విడుదల చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం 147 సూట్ కేస్ కంపెనీలను పెట్టిందని ఆరోపించారు. రు.25,000 కోట్ల ఈ కుంభకోణం కారణంగా 80 మంది చనిపోయారని, 46 లక్షలమంది బాధితులు రోడ్డున పడ్డారని తెలిపారు. నిందితుల్ని అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్ట్ ఆదేశించినా ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవటంలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు కూడా దీనిపై నోరుమెదపకపోవటాన్ని తప్పుబట్టారు. అగ్రిగోల్డ్ గ్రూప్ యజమానులను ఉరితీయాలని, దీనిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close