తమిళనాడులో కక్ష సాధింపుల్లేవా.? మరి ఇదేంటి ?

తమిళనాడులో సీఎం స్టాలిన్ కక్ష సాధింపులకు పాల్పడటం లేదని బయట పబ్లిసిటీ వస్తోంది కానీ తమిళనాడులో మాత్రం సీన్ వేరేలా ఉంది. అక్కడ అన్నాడీఎంకే మంత్రులపై వరుసగా రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతున్నాయి. ఇళ్లలో సోదాలు చేసి కేసులు పెడుతున్నాయి. ఇప్పటికే నలుగురు మాజీ మంత్రుల్నిఇలా కేసుల్లో బుక్ చేసేశారు. తమిళనాడులో డైరక్టరేట్ ఆఫ్ విజినెల్స్ అండ్ యాంటీ కరప్షన్ పేరుతో ప్రత్యేక దర్యాప్తు విభాగం ఉంది. ఈ దర్యాప్తు సంస్థ కొద్ది రోజులుగా అన్నాడీఎంకే నేతలపై దృష్టి పెట్టింది. వరుసగా సోదాలు నిర్వహిస్తోంది.

ముఖ్యంగా మాజీ మంత్రులపై దృష్టి పెట్టారు. మొదట మాజీ రవాణా మంత్రి ఎంఆర్‌ విజయ భాస్కర్‌ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. తర్వాత రిజస్ట్రేషన్ల శాఖ మాజీ మంత్రి వీరమణి, తర్వాత నగరాభివృద్ధి శాఖ నిర్వహించిన వేలుమణి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. తాజాగా విద్యుత్‌శాఖ మాజీ మంత్రి తంగమణి ఇంట్లో సోదాలు నిర్వహించి ఆదాయానికి మించి ఆస్తు లు గడించినట్టు కేసు నమోదు చేసింది. అన్నాడీఎంకే నేత తంగమణి కుటుంబసభ్యులకు ఆంధ్రాలో కూడా వ్యాపారాలు ఉన్నాయి. ఏపీలోనూ వారి వ్యాపారాలపై తమిళనాడు డీవీఏసీ అధికారులుసోదాలు నిర్వహించారు.

అయితే ఈ సోదాలన్నీ కక్ష సాధింపులేనని అన్నాడీఎంకే ఆరోపిస్తోంది. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎన్నికల వాగ్దానాల్ని విస్మరించిందని, వీటిని కప్పిపుచ్చుకునేందుకు తమ పార్టీ వర్గాల మీద దాడులకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. తాము అధికారంలో లేని పదేళ్ల కాలంలో ఎంతో మంది డీఎంకే నేతల్ని అరెస్ట్ చేశారని.. అది కక్ష సాధింపు అయితే.. ఇప్పుడు కూడా అలాగే అనుకోవాలని అన్నాడీఎంకే నేతలకు డీఎంకే నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే తాము సైలెంట్‌గా ఉంటే.. చేతకాని వాళ్లం అని అనుకుంటారేమో అని పబ్లిసిటీ రాకుండా స్టాలిన్ రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close