అఖిలేష్ యాదవ్ వెనక్కి తగ్గారు కానీ…

యూపిలో అధికార సమాజ్ వాది ప్రభుత్వంలో రాజుకొన్న చిచ్చుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ ఆర్పివేసినట్లే ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన మంత్రివర్గ విస్తరణ చేశారు. దానిలో ముగ్గురు కొత్త మంత్రులతో సహా గాయత్రి ప్రజాప్రతికి కూడా చోటు దక్కింది.

విశేషమేమిటంటే, గాయత్రి ప్రజాప్రతిపై అవినీతి ఆరోపణలు రుజువు అవడంతో అఖిలేష్ యాదవ్ స్వయంగా ఆయనని కొన్ని రోజుల క్రితమే మంత్రి పదవిలో నుంచి తొలగించారు. తద్వారా తను అవినీతి ఏ స్థాయిలో ఉన్నా సహించబోనని, తన ప్రభుత్వం చాలా పారదర్శకంగా, నీతివంతంగా పరిపాలన చేస్తోందని రుజువు చేసుకొనేందుకు అఖిలేష్ యాదవ్ ప్రయత్నించారు. కానీ మళ్ళీ ఇప్పుడు తను తొలగించిన ఆ అవినీతిపరుడినే మంత్రివర్గంలోకి తీసుకోవలసిరావడంతో ప్రజలకి, ముఖ్యంగా ప్రతిపక్షాలకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు.

గాయత్రి ప్రజాప్రతిని మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకొనేలా చేసి ములాయం సింగ్ యాదవ్ పార్టీపై, కొడుకు ప్రభుత్వంపై తన ఆధిపత్యం నిరూపించుకోగలిగారు. పైగా పార్టీకి అధ్యక్షుడుగా తన తమ్ముడు శివపాల్ యాదవ్ ని నియమించడంతో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య పెద్ద అడ్డుగీత కూడా గీసినట్లయింది. ఆ కారణంగా పార్టీకి, ప్రభుత్వానికి మద్య సమన్వయం కొరవడి దేని దారి దానిదేనన్నట్లుగా సాగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇటువంటి పరిణామాలు వలన తన కొడుకుకి, పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు ఏర్పడుతుందని పెద్దాయన (ములాయం సింగ్ యాదవ్) గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ : బాలకృష్ణ

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమ స్పందన తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పాలనలో ఎంతో అభివృద్ధి సాధించిన సినీ పరిశ్రమ, అలాగే లబ్దిపొందిన చాలా...

జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది నిజం – మోదీ, షాలతో భేటీ డౌట్ !

లండన్ లో ఉండి చంద్రబాబును అరెస్టు చేయించి ఇండియాకు రాక ముందే ఢిల్లీ పర్యటన పేరుతో ప్రచారం చేసుకుని మోడీ , షాలతో భేటీ అవుతారని ప్రచారం చేయించుకున్న జగన్ రెడ్డి తాపత్రయం...

చంద్రబాబుకు డబ్బు ముట్టినట్లు ఆధారాలున్నాయా ?: ఏసీబీ కోర్టు జడ్జి

చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, అలాగే బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఉదయం చంద్రబాబు తరపు లాయర్ దూబే, మధ్యాహ్నం...

సుధీర్ బాబుకి ‘హంట్’ నేర్పిన గుణపాఠం

సుధీర్ బాబు 'హంట్' సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. కెరీర్ లో పలు ప్రయోగాలు చేసిన సుధీర్ బాబు.. హంట్ కూడా తనకు మరో ప్రయోగాత్మక చిత్రం అవుతుందని బలంగా నమ్మాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close