రూ. 25 కోట్లు విరాళం..! రియల్ హీరో అక్షయ్‌కుమార్..!

మా అభిమాన హీరో కరోనాపై పోరాటానికి రూ. పాతిక కోట్లు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో… ఆయా హీరోల అభిమానులు హంగామా చేస్తూంటారు. ఇలాంటి ఫేక్ పోస్టులు తరచూ వస్తూంటాయి. అయితే.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గురించి.. ఇలా ఓ పాతిక కోట్లు ఇస్తున్నట్లుగా ఎక్కడైనా పోస్టు కనిపిస్తే.. అది ఫేక్ కాదు. వర్జినల్. ఆయన తన సేవింగ్స్ నుంచి ఏకంగా రూ. పాతిక కోట్లు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడాస్పందించారు. గ్రేట్ గెస్చర్ అని అభినందించారు. అదే సమయంలో.. టాటా ట్రస్ట్ అధిపతి..రతన్ టాటా… రూ. ఐదు వందల కోట్లను.. కరోనాను ఎదుర్కొనేందుకు ఫండ్‌గా ప్రకటించారు. ఈ మొత్తంతో ఆస్పత్రులకు కావాల్సిన వెంటిలేటర్లు ఇతర సౌకర్యాలను కల్పిస్తామని ప్రకటించారు.

బాలీవుడ్ నుంచి… ప్రధానంగా స్పందించి అక్షయ్ కుమార్ మాత్రమే. ఏకంగా రూ. పాతిక కోట్ల రూపాయలను ప్రకటించడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. గత ఎన్నికల సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్రమోడీని అపొలిటికల్ ఇంటర్యూ చేసి.. కొన్ని ప్రశంసలు..మరెన్నో విమర్శలు అందుకున్నారు. ఆయనకు కెనడా పాస్‌పోర్టు ఉండటంతో ఓటు కూడా వేయలేకపోయారు. అప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే.. సాయం చేయడంలో.. ఆయన ఎప్పుడూ ముందు ఉంటారు. గతంలోనూ.. రైతులకు సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. బాలీవుడ్‌లో బడా బడా హీరోలు.. ప్రొడ్యూసర్లు ఉన్నా.. ఇంత వరకూ స్పందించలేదు.

టాలీవుడ్‌తో పాటు.. ఇతర సినీ రంగాల నుంచి పెద్ద ఎత్తున స్టార్లు.. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు..ఆయా రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్లకు విరాళాలు ప్రకటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్లే ఇంకా ప్రారంభించలేదు. బహుశా.. అక్షయ్ కుమార్ స్టార్ట్ చేశారు కాబట్టి.. ఇక వారిపై ఒత్తిడి పెరుగుతుందేమో చూడాలి. పీఎం కేర్స్ పేరుతో కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఓ ఫండ్ ప్రారంభించారు. ఎంత చిన్న మొత్తమైనా ఆ ఫండ్‌కు జమ చేయవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close