అమరావతి రైతుల పాదయాత్ర ఆగిపోయినట్లేనా ?

అమరావతి రైతుల పాదయాత్ర ఆగిపోయినట్లుగానే కనిపిస్తోంది. ఆంక్షలు సడలించడానికి హైకోర్టు నిరాకరించడం కేవలం ఆరు వందల మంది రైతులు మాత్రమే పాల్గొనాలని మద్దతిచ్చే వారు కలిసి నడవకూడదని.. రోడ్డు పక్కన ఉండాలని చెప్పడంతో రైతులు నిరాశకు గురయ్యారు. తర్వాత రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌కూ హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. దీంతో రైతులు పాదయాత్ర ప్రారంభంపై ఇంకా ఎలాంటిప్రకటన చేయలేదు. ఖచ్చితంగా పాదయాత్ర చేస్తామని ప్రకటించారు కానీ.. ఎప్పటి నుంచన్న దానిపై స్పష్టత లేదు.

అయితే ఢిల్లీ వేదికగా తమ వాదన వినిపించాలన్న ఆలోచనకు మాత్రం వచ్చారు. వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఢిల్లీ వేదికగా నిరసనలు తెలపాలని రాజధాని రైతులు భావిస్తున్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే ఢిల్లీలో నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 17,18 తేదీల్లో జంతర్‌మంతర్‌లో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

డిసెంబర్‌ 7 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని అమరావతి రైతులు నిర్ణయించారు. ఢిల్లీలో ధర్నా పూర్తయిన తర్వాత రైతులు… ఏపీలో చేపట్టాల్సిన పాదయాత్రపై నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. వైసీపీ నేతలు ఇప్పటికే… పాదయాత్ర ఆగిపోయినట్లేనని ప్రకటిస్తున్నారు. పాదయాత్ర ఆపేస్తే వారి పంతమే నెగ్గినట్లవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close