ఇప్పటం రైతులు చేసిందేంటి , అమరావతి రైతులు చేయనిదేంటి పవన్ కళ్యాణ్ ?

ఇప్పటం రైతుల్లా పోరాడితే అమరావతి తరలిపోయేది కాదని జనసేన పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు ఇప్పటం రైతులు చేసిన పోరాటం ఏమిటి..? అమరావతి రైతులు చేయనిది ఏమిటి ? అన్నది అనేక మందికి వస్తున్న సందేహం. ఇప్పటం రైతులు ఎలాంటి పోరాటం చేయలేదు. వారు ఇళ్లు కూలగొట్టే వరకూ ఏ ఉద్యమమూ చేయలేదు. ఇళ్లు కూలగొట్టిన తర్వాత కూడా ఆ గ్రామం మొత్తం ఏకతాటిపైకి రాలేదు. అసలు రైతులు ఎలాంటి ఉద్యమమూ చేయలేదు. పైగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి .. ఫైన్స్ వేయించుకోవాల్సి వచ్చింది.

మరి పవన్ దృష్టిలో ఇప్పటం రైతులు చేసిన పోరాటం ఏమిటోన్న సందేహం ఎక్కువ మందికి వస్తోంది. బహుశా.. ప్రభుత్వ నిర్బంధాలను కాదని.. జనసేన సభకు భూములు ఇవ్వడమే పోరాటం అని పవన్ అనుకుంటున్నారేమో తెలియదు కానీ.. అలాంటి ఉద్యమం అయితే అమరావతి రైతులు రాష్ట్రం కోసం ఎప్పుడో చేశారు. రాష్ట్రానికి రాజధాని అవసరమని.. ప్రజారాజధాని నిర్మాణానికి అవసరం అని ప్రభుత్వం అడగగానే.. అన్ని పక్షాలు ఓకే చెప్పగానే.. వేల ఎకరాల భూముల్ని.. అసువుగా ఇచ్చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత వారు చేయని ఉద్యమం లేదు. పడని కష్టాలు లేవు.లాఠీ దెబ్బలు తిన్నారు. కేసుల పాలయ్యారు. జైళ్లకు వెళ్లారు.

మహిళలనే తేడా లేకుండా.. అన్ని పోరాటాలు చేశారు. చివరికి న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. అలా చేయబట్టే.. అమరావతికి రాజ్యాంగం అండగా నిలిచింది. ఇప్పడు అమరావతే రాజధాని అని హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. తరలిపోయే చాన్స్ లేదు. ముఖ్యమంత్రే పెడసరంగా… తాను వైజాగ్ పోయి పాలన చేస్తానని చెబుతున్నారు. దాన్ని ఎలా అయినా సమర్థించుకోవచ్చు.. కానీ నైతికంగా.. మాత్రం పతనం అయినట్లే. దీన్ని పవన్ పట్టించకోకుండా.. అమరావతి రైతుల ఉద్యమంలో ఏదో లోపం ఉందని..ఇప్పటం రైతుల్లా పోరాడలేదని వ్యాఖ్యానించడం.. అమరావతి రైతుల్ని అవమానించడమే. అయినా పవన్ ఏ ఉద్దేశంతో అన్నారో స్పష్టత రావాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close